సహకారం వదిలేసి..అక్రమాలకు తెరతీసి
ఉమ్మడి ప్రకాశంలో 176 సంఘాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార(పీఎసీఎస్) సంఘాలు కాగా మరికొన్ని ఉద్యోగ సంఘాల క్రెడిట్ సొసైటీలు. గుర్తింపు కలిగినవాటికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు
అప్పుల ఊబిలో 70 పీఎసీఎస్లు
ఆడిట్లో వెలుగుచూసిన వ్యవహారం
వేటపాలెం కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ
సభ్యుల మూలధనాన్ని వినియోగించుకొని ప్రభుత్వ సాయంతో సేవలందించాల్సి సహకార సంఘాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో రుణాల ఊబిలో కూరుకుపోయాయి.. ఇటీవల సహకార శాఖ నిర్వహించిన 2021-22 వార్షిక ఆడిట్లో ఈ విషయం బయటపడింది. ఒకటి రెండు కాదు ఏకంగా 70 సంఘాలదీ ఇదే దుస్థితి. అదే సమయంలో అనేక అక్రమాలూ వెలుగుచూశాయి.
ఒంగోలు నగరం, న్యూస్టుడే: ఉమ్మడి ప్రకాశంలో 176 సంఘాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార(పీఎసీఎస్) సంఘాలు కాగా మరికొన్ని ఉద్యోగ సంఘాల క్రెడిట్ సొసైటీలు. గుర్తింపు కలిగినవాటికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తక్కువ వడ్డీకి నిధులిస్తుంది. వాటిని సభ్యులకు రుణాలుగా ఇచ్చి సకాలంలో రికవరీ చేయడం ద్వారా వచ్చే ఆదాయంతో సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలి. నిబంధనల ప్రకారం నిర్వహిస్తే పరపతి పెరిగి బ్యాంకు రుణాలు ఇతోధికంగా పొందొచ్చు.. నాలుగేళ్లుగా జిల్లాలో పీఏసీఎస్లకు ఎన్నికలు జరగలేదు. గడువు మీరినవాటికి ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిన త్రిసభ్య కమిటీలను నియమించింది. అధికారపార్టీ ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ఇవి ఏర్పాటైపోయాయి.
ఆదాయ వనరులివి..
పీఎసీఎస్లకు పీడీసీసీ బ్యాంకు అయిదున్నరశాతం వడ్డీ రేటుతో నిధులు కేటాయిస్తుంది. వాటిని రైతులకు 7 శాతం వడ్డీతో రుణాలుగా ఇస్తారు. అందులో ఒకటిన్నర శాతం వడ్డీ సంఘానికి ఆదాయంగా మిగులుతుంది. సకాలంలో వసూలు చేసి పీడీసీసీబీకి చెల్లిస్తే మరుసటి ఏడాది అంతకన్నా ఎక్కువగా నిధులు పొందొచ్చు. మిగులు ధనం ఉన్న సంఘాలు పంటల కొనుగోలు, దుకాణాల నిర్వహణ, పెట్రోలు బంకుల ఏర్పాటు తదితర వ్యాపారాలపై పెట్టుబడి పెట్టి కమిషన్ ద్వారా ఆదాయం సముపార్జించవచ్చు.
వాటిపై ప్రత్యేక నివేదికలు..
సహకారశాఖ చేయించిన ఆడిట్లో 70 సొసైటీల్లో అనవసర ఖర్చులు చేసినట్లు గుర్తించారు.. అక్రమాలు ఎక్కువగా ఉన్న మూడింటిపై యాక్టు 51 ప్రకారం విచారణకు అధికారులను నియమించారు. వేటపాలెం కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, కారుమంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఒంగోలు ఎన్జీవో హౌసింగ్ బిల్డింగ్ సొసైటీలపై విచారణ కొనసాగుతోంది. హౌసింగ్ సొసైటీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకుంది.
నిబంధనలకు విరుద్ధంగా..
పీడీసీసీబీ ద్వారా తీసుకున్న నిధులు పూర్తిస్థాయిలో చెల్లించకపోవడం, ఖాతాదారులు కట్టిన సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేయడం వల్ల దాదాపు 70 సంఘాల్లో ఖజానా ఖాళీ అయిపోయింది. జీవోలు 36, 90 హెచ్ఆర్ పాలసీ ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారిని వీటిలో ఉద్యోగులుగా కొనసాగించకూడదు.. 2019 మార్చి తరువాత కొత్తగా నియామకాలు జరపకూడదు. అయితే 40 సొసైటీల్లో ఒప్పంద పద్ధతిపై నియమించి రుణాల రికవరీ ద్వారా వచ్చిన డబ్బును వారికి వేతనాలుగా చెల్లిస్తున్నారు. త్రిసభ్య కమిటీల విలాసాలు.. రబ్బరు స్టాంపులు, పుస్తకాల కొనుగోలుకు అధిక ఖర్చు చూపి బిల్లులు డ్రాచేయడం వంటి అక్రమాలతో సంఘాలు వట్టిపోయాయి.
మరికొన్నింటిపై విచారణ
నిబంధనలకు విరుద్ధంగా ఖర్చులు పెట్టిన సంఘాలను ఆడిట్లో గుర్తించి నివేదికలు ఇచ్చారు. వాటిలో ప్రస్తుతం మూడింటిపై విచారణ కొనసాగుతోంది. మరో 67 సొసైటీల నివేదికలను పరిశీలించి తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటాం. కొన్ని సంఘాలు తీసుకున్న రుణాలు సక్రమంగా వినియోగించి ఆర్థికంగా బలోపేతం అయ్యాయి. సంతమాగులూరు మండలం వెల్లలచెరువు, రావినూతల సొసైటీ ఉదాహరణ.
- పి.రాజశేఖర్, జిల్లా సహకారశాఖ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాలంటీర్ల మెడపై వైకాపా కత్తి
[ 24-04-2024]
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో వైకాపా నేతలు, ఆ పార్టీ అధినేతను మించిన వారుండరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. -
అన‘కొండలు’ తిన్న మన్ను.. రూ.860 కోట్లు
[ 24-04-2024]
తవ్వుకు‘న్నోళ్ల’కు తవ్వుకున్నంత.. మేసి‘నోళ్ల’కు మేసినంత. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో సహజ వనరుల విధ్వంసం యథేచ్ఛగా సాగింది. నేతల ముసుగులో ఉన్న గుంట నక్కలు బరితెగించాయి. -
ఇది కాదా.. జగన్నాటకం!
[ 24-04-2024]
అబద్ధపు హామీలు గుప్పించడం.. మాయమాటలు చెప్పడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని మించినవారుండరు. అయిదేళ్లు పట్టించుకోకుండా ఉండటం. -
నామినేషన్ల వేళ మారిన పేర్లు
[ 24-04-2024]
నామినేషన్ల దాఖలు సమయంలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చోటుచేసుకుంది. గతంలో ప్రకటించిన వారికి కాకుండా కొన్నిచోట్ల ఇతరులకు సీట్లు కేటాయించారు. -
అరవీర ‘రంగు’ మార్తాండ
[ 24-04-2024]
మురుగు కాలువలు లేవు. ఉన్న వాటినైనా శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లే దిక్కు. పగిలిపోతే మరమ్మతులకు పైసల్లేవు. -
క్యాషియర్ జగన్.. నొక్కవేం బటన్
[ 24-04-2024]
రాష్ట్రంలో సంక్షేమం కోసం తరచూ బటన్లు నొక్కుతున్నాను. ప్రతి గడపకూ సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేరుస్తున్నానంటూ గొప్పలు చెప్పే ముఖ్యమంత్రివన్నీ ఉత్తుతి మాటలేనని అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సర్పంచులపై గురి.. పల్లెలకు ఉరి
[ 24-04-2024]
పల్లెవాసుల ఆశల్ని చిదిమేశారు..పట్టుగొమ్మలనూ నరికేశారు..నిధుల్ని దిగమింగేశారు..చిల్లిగవ్వ కోసం దేబిరించాల్సిన దుస్థితిలోకి పంచాయతీల్ని నెట్టేశారు. -
అయిదో రోజు 46 నామపత్రాల దాఖలు
[ 24-04-2024]
ఒంగోలు పార్లమెంట్తోపాటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అయిదో రోజైన మంగళవారం 46 మంది తమ నామపత్రాలు దాఖలు చేశారు. -
తెదేపాలో చేరికల జోరు
[ 24-04-2024]
తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. మంగళవారం వైకాపా సర్పంచి కోమలి భర్త బొల్లినేని మధు అనుచర గణంతో సహా పార్టీలో చేరారు. -
కరోనాతో ఆర్థికంగా కుదేలై.. మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య
[ 24-04-2024]
కరోనాతో ఆర్థికంగా కుదేలైన ఓ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం సింగరాయకొండలో చోటు చేసుకుంది. -
చిట్టితల్లి వేడుక చూడకుండానే..
[ 24-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి పుష్పాలంకరణ వేడుక చూడకుండానే ఆ తండ్రి దూర తీరాలకు చేరుకున్నారు. సామగ్రి తీసుకొస్తుండగా, కారు చక్రాలు కర్కశంగా ఆయన్ను చిదిమేశాయి. -
ఉత్సవ విగ్రహాల్లా మార్చేశావ్.. జగన్
[ 24-04-2024]
గత ప్రభుత్వ హాయంలో సర్పంచులు అంటే ఎంతో గౌరవంగా ఉండేది. చెక్ పవర్తో నిధులను ఖర్చు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేవారు. -
రోడ్లు ఛిద్రం.. ఒళ్లు హూనం
[ 24-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. ఎక్కడా ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఈ దారుల్లో ప్రయాణిస్తే ఒళ్లు హూనమవుతుందో రామచంద్రా అని ప్రజలు బాధ వెలబోసుకున్న వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. -
‘భూ’చోళ్ల అవినీతి రూ.201.33 కోట్లు
[ 24-04-2024]
ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూముల కొనుగోలులో భారీ ఎత్తున కుంభకోణం చోటుచేసుకుందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని భూ పరిపాలన శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్