ఉచిత బియ్యం ఇక రావా..
6.55 లక్షల కుటుంబాల ఎదురుచూపులు
బియ్యం పంపిణీ
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే కొవిడ్ నేపథ్యంలో బియ్యం కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ యోజన కింద మనిషికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చితో ఇది ముగియాల్సి ఉన్నా మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ప్రతి నెలా మూడో వారం నుంచి చౌకధరల దుకాణాల వద్ద డీలర్లు వీటిని ఇస్తుంటారు. ఏప్రిల్ నెల ఉచిత కోటాతో పాటు మే నెలకు సంబంధించి కూడా ఇంతవరకు పంపిణీ చేయకపోవడంతో ఇంతకీ ఇస్తారా? ఇవ్వరా? అన్న సందేహం కార్డుదారుల్లో నెలకొంది.
అధికారులకు స్పష్టత లేక...
పునర్విభజన తర్వాత ప్రకాశం జిల్లాలోని 38 మండలాల్లో 1,392 చౌకధరల దుకాణాలు ఉండగా, వాటి పరిధిలో 6,55,490 బియ్యం కార్డులు ఉన్నాయి. ప్రతి నెలా పంపిణీ నిమిత్తం 9,309 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయిస్తున్నారు. విభజన వల్ల ఏప్రిల్ మొదటి వారం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తాను ఇచ్చే కిలో రూపాయి బియ్యం పంపిణీ చేపట్టింది. మే నెలలో కూడా బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ 17వ తేదీతో పూర్తయింది. కేంద్రం ఉచితంగా అందించే బియ్యం మాత్రం గత రెండు నెలలుగా ఇవ్వకపోవడంతో కార్డుదారులు ఎదురు చూస్తున్నారు.
నిండుకున్న నాన్ సార్టెక్స్ నిల్వలు
కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా సార్టెక్స్ బియ్యాన్ని సరఫరా చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నాన్ సార్టెక్స్ అందజేస్తోంది. సార్టెక్స్ బియ్యం కిలో రూ.37.50 ఉండగా, నాన్ సార్టెక్స్ రూ.36.50 చొప్పున వ్యయం అవుతోంది. ఉచిత బియ్యం పంపిణీ నిమిత్తం ఏప్రిల్, మే నెలలకు కలిపి మొత్తం 18,618 మెట్రిక్ టన్నుల నాన్ సార్టెక్స్ బియ్యం కేంద్రానికి అవసరం. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ వద్ద నిల్వలు లేనట్లు సమాచారం. ఒకవేళ అందుబాటులో ఉన్న సార్టెక్స్ బియ్యాన్ని పంపిణీ చేస్తే కిలోకు రూపాయి చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారం పడుతోంది. తగు నిల్వలు లేనప్పుడు ఎఫ్సీఐ వద్ద బియ్యం కొనుగోలు చేసి పంపిణీ చేస్తే ఆ మొత్తాన్ని కేంద్రం తిరిగి రాష్ట్రానికి చెల్లిస్తోంది. కనీసం వారం ముందు నుంచే పౌరసరఫరాల గోదాములకు చేర్చి, ఆ తర్వాత చౌకధరల దుకాణాలకు తరలిస్తారు. ఇందుకు నెలాఖరు వరకు సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ నెలైనా బియ్యం ఇస్తారా అన్నదానిపై అధికారుల్లో స్పష్టత లేదు. పౌరసరఫరాల సంస్థ డీఎం గ్లోరియాను వివరణ కోరగా ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి ఇంత వరకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Ts Inter results 2022: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్... క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి...
-
Business News
Pallonji Mistry: వ్యాపార దిగ్గజం పల్లోంజి మిస్త్రీ కన్నుమూత
-
Movies News
Nambi Narayanan: దేశం కోసం శ్రమిస్తే దేశ ద్రోహిగా మార్చారు.. నంబి నారాయణన్ కథ ఇదీ!
-
Sports News
Rohit Sharma: రోహిత్ ఆరోగ్యంపై సమైరా అప్డేట్.. ముద్దుముద్దు మాటల వీడియో వైరల్
-
General News
Justice Ujjal Bhuyan: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
-
India News
Corona: 2.5 శాతానికి దిగొచ్చిన రోజువారీ పాజిటివిటీ రేటు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- ఆవిష్కరణలకు అందలం
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- ఔరా... అనేల
- IND vs ENG: బుమ్రాకు అరుదైన అవకాశం?
- Viveka Murder Case: శివశంకర్రెడ్డిదే కీలక పాత్ర
- Anand Mahindra: క్వాలిఫికేషన్ అడిగిన నెటిజన్.. వైరల్గా మారిన ఆనంద్ మహీంద్రా సమాధానం!
- ‘అమ్మఒడి’ ల్యాప్టాప్లకు మంగళం
- సన్నిహితులకే ‘కిక్కు!’