అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న అయిదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఒంగోలు రెండో పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.12.50 లక్షల విలువైన 34 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
రూ.12.50 లక్షల సొత్తు స్వాధీనం
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ మలికా గార్గ్... చిత్రంలో డీఎస్పీ నాగరాజు, ఇతర అధికారులు, సిబ్బంది
ఒంగోలు నేర విభాగం, న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న అయిదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఒంగోలు రెండో పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.12.50 లక్షల విలువైన 34 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మలికా గార్గ్ వివరాలు వెల్లడించారు. ఒంగోలు నగరంలో ఇటీవల జరిగిన చోరీల నేపథ్యంలో యంత్రాంగాన్ని ఎస్పీ అప్రమత్తం చేశారు. ఈ క్రమంలోనే ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు పర్యవేక్షణలో, రెండో పట్టణ సీఐ ఎన్.రాఘవరావు ఆధ్వర్యంలో నిఘా బృందాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 20న సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో... రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని యువకులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారన్న సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద బంగారు ఆభరణాలు లభించటంతో లోతుగా విచారించారు. నిందితులు కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లా నాగరకట్టె గ్రామానికి చెందిన పురుషోత్తమ, సచిన్, జీవన్, అజయ్, పునీత్లుగా గుర్తించారు. ఒంగోలులోని అగ్రహారం గేటు, ఇందుర్తినగర్, ఏలూరు జిల్లా కేంద్రం, కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా చిక్కజాజూరు గ్రామాల్లో చోరీలకు పాల్పడినట్లు తేలింది. వారి నుంచి రూ.12.50 లక్షల విలువైన 34 సవర్ల (272 గ్రాములు) బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో పురుషోత్తమ్పై ఓ హత్య కేసు కూడా నమోదైంది. నిందితుల అరెస్టు, సొత్తు రికవరీకి కృషి చేసిన అధికారులతో పాటు... ఏఎస్సై బాలాంజనేయులు, హెడ్ కానిస్టేబుళ్లు జి.అంకమ్మరావు, డి.నరసయ్య, కానిస్టేబుళ్లు సీహెచ్.అంజిబాబు, ఎస్డి.చాంద్బాషా, ఎస్.కిషోర్, ఎన్.లక్ష్మీకాంతరావు, ఐటీ కోర్టీమ్ కానిస్టేబుళ్లు అవినాష్, సురేష్, హోంగార్డులు ఎస్.చిరంజీవి, డి.మాధవరావును ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు, రివార్డులు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కోతల’రాయుడు
[ 18-04-2024]
పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆచరణలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పథకాల వారీగా ఇప్పటికే కోతలు పెట్టారు. -
కీలక ఘట్టం ఆరంభం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకఘట్టం ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు ఆర్వోలు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
జగనా‘సుర’ కుట్రలు
[ 18-04-2024]
-
వాలంటీర్లతో.. రాజకీయ నాటకాలు
[ 18-04-2024]
ఈ నెల 10న ఒంగోలు సమతానగర్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఒకటో లైన్లో నివసిస్తున్న చప్పిడి ప్రభావతి నివాసానికి వెళ్లారు. -
రాహుల్.. సాధించి చూపెన్
[ 18-04-2024]
దేశంలోనే అత్యున్నత సర్వీస్.. కఠిన పరీక్షగా చెప్పుకొనే సివిల్స్ సాధించడం అంటే అంత సులువేమీ కాదు. కొలువులందరికీ అంత తేలిగ్గా దక్కవు. లక్షల మందికి అదో చిరకాల స్వప్నం.. సాకారం కాని కలగానే మిగిలిపోతుంటుంది మరి. -
నాడు అద్దం.. నేడు అధ్వానం
[ 18-04-2024]
ఒంగోలు నగరంలోని కర్నూలు పై వంతెన నాడు ఆహ్లాదానికి చిరునామాగా ఉండేది. కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చే వారికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ..ఆంధ్రుల రాజసానికి అద్దంపట్టేలా రూపుదిద్దారు. -
పర్యాటకాన్ని చిదిమేసిన పాలకుడు
[ 18-04-2024]
-
నామపత్రాల ప్రక్రియకు పటిష్ఠ బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి నామపత్రాల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ఆయా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేయాలని గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అధికారులను ఆదేశించారు. -
వేటగాళ్ల ఉచ్చు.. వన్యప్రాణులు బలి
[ 18-04-2024]
నల్లమల అటవీ పరిధి లోయ పల్లెల్లో వేటగాళ్ల దుశ్చర్యలు హద్దు మీరుతున్నాయి. వేటగాళ్లపై అటవీశాఖ నిఘా పూర్తిగా కరువైంది. దీనికి విద్యుత్తు సిబ్బంది సహకారం తోడవడంతో రెండు రోజుల క్రితం రెండు చుక్కల దుప్పులను విద్యుదాఘాతంతో చంపారు. -
వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
రాములోరి కల్యాణం బుధవారం వాడ, వాడలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదం పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
అభివృద్ధి మరిచి.. పర్యాటకానికి పాతర
[ 18-04-2024]
-
ప్రమాదవశాత్తూ మంటలంటుకొని రైతు సజీవ దహనం
[ 18-04-2024]
ఎండిపోయిన పంటకు నిప్పంటించగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని రైతు సజీవ దహనమైన సంఘటన తాళ్లూరులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్