logo

నీటికుంటలో మృతదేహం

వలేటివారిపాలెం పరిధిలోని నీటికుంటలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతదేహం నీటిపై తేలియాడుతుండటాన్ని స్థానికులు గుర్తించి వీఆర్‌వో, తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా

Published : 22 May 2022 03:06 IST

ఒంగోలు నేరవిభాగం: వలేటివారిపాలెం పరిధిలోని నీటికుంటలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతదేహం నీటిపై తేలియాడుతుండటాన్ని స్థానికులు గుర్తించి వీఆర్‌వో, తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వయసు నలభై ఏళ్లు ఉంటుందని... రెండు రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ముఖం ఉబ్బి, కళ్లు బయటకు వచ్చాయి. శరీరంపై బొబ్బలు తేలి రక్తం కనిపిస్తుండడంతో... పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని