నిప్పుల కొలిమి
అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. సాయంత్రం ఆరు గంటలు దాటినా వేడి తగ్గడంలేదు. సోమవారం కొనకనమిట్ల మండలం చిన్నారికట్లలో అత్యధికంగా 42.19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది
చిన్నారికట్లలో అత్యధికంగా 42.19 డిగ్రీలు
ఎండ తీవ్రతకు సోమవారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా
ఉన్న ఒంగోలులోని చర్చి కూడలి ప్రాంతం
ఒంగోలు గ్రామీణం, యర్రగొండపాలెం, న్యూస్టుడే: అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. సాయంత్రం ఆరు గంటలు దాటినా వేడి తగ్గడంలేదు. సోమవారం కొనకనమిట్ల మండలం చిన్నారికట్లలో అత్యధికంగా 42.19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో ఇదే అధికం. దీనికి తోడు వడగాల్పులు మొదలయ్యాయి. రోడ్లన్నీ కర్ఫ్యూ వాతావరణం తలపించేలా నిర్మానుష్యంగా మారుతున్నాయి. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
జన జీవనంపై ప్రభావం
సాధారణ ప్రజలతో పాటు వీధి వ్యాపారులు, పనులకు వెళ్లే కార్మికులు, వ్యవసాయ కూలీలు ఎండ తీవ్రతకు పని ప్రాంతంలో ఉండలేని పరిస్థితి నెలకొంది. ఉపాధిహామీ కూలీలు పనిచేసే చోట వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. రాత్రి వేళల్లోనూ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల చొప్పున నమోదు కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. దీనికితోడు పల్లెల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. నిత్యావసర వస్తువులు, ఇతర సామగ్రి కొనుగోలుకు బజారుకు వచ్చినవారు ఉదయం 11 గంటకల్లా ముగించుకొని తిరుగుముఖం పడుతున్నారు. కొన్నిచోట్ల దుకాణాలు మధ్యాహ్నం 12 కే మూతపడుతున్నాయి. సాయంత్రం 5 గంటల తర్వాత తిరిగి తెరుస్తున్నారు.
నిపుణుల సూచనలు ఇలా...
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వడదెబ్బకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలలోపు సాధ్యమైనంత వరకు బయటకు రాకూడదు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే ముక్కు, చెవులకు వస్త్రం చుట్టుకోవడంతోపాటు, ముఖం, నోరు పొడిబారితే వెంటనే నీడలోకి వెళ్లి ఏదైనా ద్రవ పదార్థం తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో పనిచేసే వారు అప్రమత్తంగా ఉండాలి. నీటిని ఎక్కువగా తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్లరసాలు తీసుకోవాలి. వడగాలుల వల్ల ద్విచక్ర వాహనంపై ఎక్కువ దూరం ప్రయాణించడం సరికాదు’ అని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన అధిక ఉష్ణోగ్రతలు ఇలా (సెల్సియస్ డిగ్రీల్లో)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.