శ్రేణులు పులకించేలా..!
ఒంగోలు మండలం మండువవారిపాలెంలో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న తెదేపా మహానాడు వేదిక ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 85 ఎకరాల స్థలంలో సభా వేదిక, షెడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. త్రోవగుంట మేజర్
ప్రత్యేకత ఉట్టిపడేలా మహానాడు ఏర్పాట్లు
ఒంగోలు అంతటా అలంకరణ
మహానాడు ఏర్పాట్లు పరిశీలిస్తున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు,
తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఎమ్మెల్యే
బాల వీరాంజనేయస్వామి, నాయకులు టీడీ జనార్దన్ తదితరులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ఒంగోలు మండలం మండువవారిపాలెంలో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న తెదేపా మహానాడు వేదిక ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 85 ఎకరాల స్థలంలో సభా వేదిక, షెడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. త్రోవగుంట మేజర్ కాలువకు ఉత్తరం వైపున ఉన్న మరో 50 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ నిమిత్తం ప్రణాళిక చేశారు. ఇరు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు అక్కడ కేటాయించనున్నారు. అందుకు అవసరమయ్యేలా రోడ్డు నిర్మించనున్నారు.
అన్ని వీధుల్లో తోరణాలతో..
ఒంగోలు నగరంలోని అన్ని ప్రధాన వీధులను కటౌట్లు, ఫ్లెక్సీలు, పసుపు తోరణాలతో అలంకరించనున్నారు. ఇప్పటికే గుత్తేదారులకు బాధ్యతలు అప్పగించారు. ఇందుకు సుమారు రూ.కోటికి పైగా వ్యయం కానున్నట్లు అంచనా. మహానాడు ప్రాంగణంలో సభ ప్రారంభానికి ముందు, అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా కాల్చనున్నారు. మండపేటకు చెందిన గుత్తేదారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రాంగణమంతా పసుపు రంగుతో కూడిన క్లాత్ కట్టేందుకు.. అలాగే ప్రభల ఏర్పాటుతోపాటు డ్రోన్లతో పూలు చల్లేందుకు యోచిస్తున్నారు.
పరిశీలించిన నేతలు
మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్, కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మలపాటి శ్రీధర్, బీఎన్ విజయకుమార్, ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు నూకసాని బాలాజీ, పార్టీ ప్రొఫెషనల్ వింగ్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.తేజస్వి, ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు వినుకొండ సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరెడ్డి, వై.వీ.సుబ్బారావు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు తదితరులు పరిశీలించారు. మంగళవారం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, బుధవారం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మహానాడు ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం ఒంగోలు రానున్నారు.
పోలీసు శాఖ సహకరించాలి: ఎమ్మెల్యే స్వామి
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: మహానాడుకు పోలీసు శాఖ సహకరించాలని కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి కోరారు. ఎస్పీ మలికా గార్గ్ను సోమవారం ఎమ్మెల్యే కలిశారు. ఈ కార్యక్రమాన్ని తెదేపా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందని.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. 28న లక్షలాదిమందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని.. కీలక నాయకులు, భారీ జన సమీకరణ నేపథ్యంలో ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సహకరించాలని కోరారు. హాజరయ్యే నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కొండపి నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలపై పోలీసులు అన్యాయంగా రౌడీషీట్లు తెరిచారని ఎమ్మెల్యే స్వామి ఆరోపించారు. వాటికి సంబంధించిన ఆధారాలను అందజేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
జాతీయ రహదారి పక్కన ఫ్లెక్సీల ఏర్పాటు
చదును చేసి షెడ్డు నిర్మాణ పనులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.