logo

లారీ ఢీకొని ఆటో చోదకుడి దుర్మరణం

లారీ ఢీకొని ఆటో చోదకుడు మృతి చెందాడు. 216 నంబరు జాతీయ రహదారిలో బుధవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పోతవరం గ్రామానికి చెందిన దశరథరామిరెడ్డి (57)

Published : 26 May 2022 06:47 IST


తండ్రి మృతదేహం చూసి రోదిస్తున్న కుమారుడు

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: లారీ ఢీకొని ఆటో చోదకుడు మృతి చెందాడు. 216 నంబరు జాతీయ రహదారిలో బుధవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పోతవరం గ్రామానికి చెందిన దశరథరామిరెడ్డి (57) తన ఆటోలో... ఒంగోలు నుంచి స్వగ్రామానికి వస్తున్నారు. నాగులుప్పలపాడు సమీపంలో అతివేగంగా వస్తున్న లారీ... ఆటోను ఢీకొనడంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. ఆటో నుజ్జుయ్యింది. ఎస్సై రాంబాబు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కొడుకు శ్రీను గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని