అడుగడుగునా ప్రశ్నల వర్షం
మురుగు కాలువలు తీయించకుండా సీసీ రోడ్లు వేయడంతో వర్షం వచ్చిన ప్రతిసారి నీరంతా ఇళ్లలోకి వస్తోందని పట్టణంలోని బీసీ కాలనీ ప్రజలు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్యాదవ్ను ప్రశ్నించారు. బుధవారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో కాలనీకి
ఛైర్మన్ అబ్దుల్ గఫార్, సీపీఎం నాయకుడు కొండారెడ్డి మధ్య వాగ్వాదం
కనిగిరి, న్యూస్టుడే: మురుగు కాలువలు తీయించకుండా సీసీ రోడ్లు వేయడంతో వర్షం వచ్చిన ప్రతిసారి నీరంతా ఇళ్లలోకి వస్తోందని పట్టణంలోని బీసీ కాలనీ ప్రజలు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్యాదవ్ను ప్రశ్నించారు. బుధవారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో కాలనీకి చెందిన బత్తుల కోటమ్మ, భాగ్యలక్ష్మి తదితర మహిళలు స్థానిక సమస్యలను ఎమ్మెల్యేకు తెలిపి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో వచ్చిన పింఛనును ఇప్పుడు అధికారులు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటేశ్వరమ్మ అనే మహిళ మాట్లాడుతూ నివేశన స్థలానికి ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్న మంజూరు చేయడం లేదని తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.
ఆక్రమణలపై ఎమ్మెల్యే ఆగ్రహం...
బీసీ కాలనీలో అడుగడుగునా ఆక్రమణలు ఉన్నాయని... అధికారులు ఏం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీ పడి రోడ్లు, మురుగు కాలువలు సైతం ఆక్రమించి రాకపోకలు సాగించేందుకు వీలులేకుండా చేశారన్నారు. వారం రోజుల్లో ఆక్రమణలు తొలగించి, సీసీ రోడ్లు, పక్క కాలువలు నిర్మించాలని టీపీవో వివేకానందను ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు బాధ్యతతో పని చేయాలని లేకుంటే చర్యలు తప్పవన్నారు.
ఛైర్మన్, సీపీఎం నాయకుడి మధ్య వాగ్వాదం
‘గడప గడప మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సమక్షంలో ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, సీపీఎం నాయకుడు ఎం.కొండారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. కాలువల్లో మురుగు తీయడం లేదని, ఆక్రమణలు జరిగిని సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పట్టించుకోవడం లేదని ఛైర్మన్ను ప్రశ్నించారు. అందుకు ఛైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి పైసా రాకున్నా సొంత నిధులు వెచ్చించి సమస్యలు పరిష్కరిస్తున్నామని ఇలా మాట్లాడటం సరికాదన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్పర్సన్ సరితారెడ్డి, ఎంపీపీ దంతులూరి ప్రకాశం, సింగిల్విండో అధ్యక్షుడు ఎస్.మోహన్రెడ్డి, వైస్ ఛైర్మన్లు ఆర్.మాణిక్యరావు, పులి శాంతి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు