రూ.500 కోసం వివాదం
నగదు విషయంపై జరిగిన వివాదం చివరకు పెద్దమనిషిగా వచ్చిన ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. ఈ ఘటన పుల్లలచెరువు మండలకేంద్రంలోని ఎస్సీపాలెంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఈ ప్రాంతంలో ఓ చర్చి వేడుక జరుగుతోంది.
గొడవపై సర్దిచెప్పిన పెద్దమనుషులపై కత్తితో దాడి
ఒకరి మృతి.. మరొకరికి గాయాలు
ఆసుపత్రి వద్ద రోదిస్తున్న మృతుని భార్య గాలెమ్మ
పుల్లలచెరువు, న్యూస్టుడే: నగదు విషయంపై జరిగిన వివాదం చివరకు పెద్దమనిషిగా వచ్చిన ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. ఈ ఘటన పుల్లలచెరువు మండలకేంద్రంలోని ఎస్సీపాలెంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఈ ప్రాంతంలో ఓ చర్చి వేడుక జరుగుతోంది. కాలనీకి చెందిన బడిపాటి నవీన్ మద్యం మత్తులో గ్లాడ్సన్ అనే వ్యక్తి వద్దకు వెళ్లి చరవాణి కావాలని.. మాట్లాడి ఇస్తానని చెప్పాడు. వెంటనే గ్లాడ్సన్ ఇచ్చారు. తిరిగి ఇచ్చిన క్రమంలో చరవాణి కవర్లో తాను భద్రపరిచిన రూ.500 నోటు కనిపించకపోవడంతో నవీన్ను గ్లాడ్సన్ ప్రశ్నించారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం గ్లాడ్సన్ విషయాన్ని భార్య సలోమికి చెప్పారు. సలోమీ నవీన్ వద్దకు వెళ్లి తన భర్తకు చెందిన డబ్బులు తీసుకున్నావా అని నిలదీశారు. అనంతరం నవీన్ ఆమె ఇంటికి వెళ్లి కర్రతో కొట్టడంతో విషయాన్ని ఆమె తన బంధువుల దృష్టికి తీసుకెళ్లారు. బంధువులు రావూరి ఆశీర్వాదం(35) ఆనందరావులు వచ్చి మహిళను కొట్టడం భావ్యం కాదని.. ఏదైనా సమస్య ఉంటే పెద్దమనుషులతో చెప్పాలని నవీన్కు హితవు పలికారు. దీంతో నవీన్ ఆగ్రహించి కత్తితో వారిద్దరిపై దాడిచేశాడు. గాయపడిన వారిద్దరినీ స్థానికులు యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆశీర్వాదం మృతిచెందారు. ఆనందరావును గుంటూరు వైద్యశాలకు తరలించారు. ఆశీర్వాదంకు భార్య గాలెమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తమ కుటుంబానికి ఆధారమేదంటూ గాలెమ్మ రోదించారు. కాగా ఆశీర్వాదం స్వస్థలం యర్రగొండపాలెం మండలం అమని గుడిపాడు. వేడుక సందర్భంగా పుల్లల చెరువు వచ్చి అనూహ్యంగా జరిగిన గొడవలో ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వేముల సుధాకర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?