TDP Mahanadu: ఒంగోలులో మహానాడు.. వాహనాల మళ్లింపు ఇలా..
ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో తెదేపా మహానాడు నేపథ్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మలికాగార్గ్ తెలిపారు.
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో తెదేపా మహానాడు నేపథ్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మలికాగార్గ్ తెలిపారు.
ఇలా రావచ్ఛు.: గుంటూరు, విజయవాడ, చీరాల వైపు నుంచి మహానాడుకు వచ్చే వాహనాలు త్రోవగుంట పై వంతెన ఎక్కకుండా బై లైన్ సర్వీసు రోడ్డులోకి వచ్చి కిమ్స్ అండర్ పాస్ ద్వారా విష్ణుప్రియ కల్యాణమండపం మీదుగా పార్కింగ్ ఏరియాకు వెళ్లి అక్కడి నుంచి సమావేశ ప్రాంగణానికి చేరుకోవాలి.
నెల్లూరు, కావలి వైపు నుంచి వచ్చేవి ఒంగోలు నగరంలోకి ప్రవేశించకుండా పెళ్లూరు పై వంతెన ఎక్కి కిమ్స్ ఫ్లై ఓవర్ వద్ద సర్వీసు రోడ్డు నుంచి కిమ్స్ అండర్పాస్ మీదుగా మహానాడుకు వెళ్లాలి.
కడప, కర్నూల్, చీమకుర్తి వైపు నుంచి వచ్చేవి కర్నూల్ బైపాస్ సెంటరు మీదగా సర్వీసు రోడ్డు ద్వారా ప్రాంగణానికి వెళ్లాల్సి ఉంటుంది.
కొత్తపట్నం వైపు నుంచి వచ్చేవి కిమ్స్ పై వంతెన పక్కన సర్వీసు రోడ్డు మీదగా చేరుకోవచ్ఛు
విజయవాడ, గుంటూరు, చీరాల వైపు నుంచి ఒంగోలులోకి ప్రవేశించే వాహనాలు కిమ్స్ పై వంతెన మీదుగా కొప్పోలు సర్వీసు రోడ్డు, కొత్తపట్నం బస్టాండ్ నుంచి ఒంగోలులోకి ప్రవేశించవచ్ఛు
బయటకు వెళ్లాలిలా..: మహానాడు నుంచి తిరిగి గుంటూరు, విజయవాడ వైపు వెళ్లడానికి జాతీయ రహదారి ఎడమవైపు నుంచి ప్రధాన రహదారిలోకి ప్రవేశించి త్రోవగుంట పై వంతెన ఎక్కి వెళ్లాలి. చీరాల వైపు వెళ్లే వాహనాలు త్రోవగుంట పైవంతెన అండర్ పాస్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. కావలి, నెల్లూరు వైపు వెళ్లేవి పార్కింగ్ ప్రాంతం నుంచి త్రోవగుంట ఫ్లై ఓవర్ అండర్ పాస్ నుంచి యూ టర్న్ తీసుకొని జాతీయ రహదారిలోకి ప్రవేశించి నెల్లూరులోకి వెళ్లాలి. కర్నూల్, కడప, చీమకుర్తి వైపు వెళ్లేవి త్రోవగుంట అండర్ పాస్ నుంచి కిమ్స్ పైవంతెన ఎక్కి పెళ్లూరు ఫ్లై ఓవర్ దిగి ఒంగోలు మినీ బైపాస్ మీదుగా కర్నూల్, కడప మార్గంలోకి వెళ్లాలి. ● ఒంగోలు నగరం నుంచి గుంటూరు, విజయవాడ వెళ్లేవి కొత్తపట్నం బస్టాండ్ నుంచి కొప్పోలు పైవంతెనకు ఎడమ వైపు సర్వీసు రోడ్డు నుంచి 16వ నెంబర్ జాతీయ రహదారి మీదకు చేరుకోవాలి. కావలి, నెల్లూరు వైపు వెళ్లాల్సినవి దక్షిణ బైపాస్.. రమేష్ సంఘమిత్ర వైద్యశాల మీదుగా పెళ్లూరు అండర్ పాస్ మీదుగా జాతీయ రహదారిపై వెళ్లాలి. చీరాల వైపు వెళ్లేవారు కొత్తపట్నం బస్టాండ్ మీదుగా కొప్పోలు ఫ్లై ఓవర్కు ఎడమ వైపు సర్వీసు రోడ్డు ద్వారా 16వ నెంబర్ జాతీయ రహదారికి వెళ్లి త్రోవగుంట అండర్ పాస్ ద్వారా ప్రయాణించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?