Dhulipalla: ఏపీలో ఒక్కో రైతుకు రూ.2.74లక్షల అప్పు: ధూళిపాళ్ల నరేంద్ర
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడేళ్లలో రాష్ట్ర రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. రైతులను వైకాపా ప్రభుత్వం దగా చేస్తోందని విమర్శించారు.
ఒంగోలు: వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడేళ్లలో రాష్ట్ర రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. రైతులను వైకాపా ప్రభుత్వం దగా చేస్తోందని విమర్శించారు. ఒంగోలులో నిర్వహిస్తున్న తెదేపా మహానాడులో ‘కష్టాల కడలిలో సేద్యం.. దగా పడుతున్న రైతన్న’ తీర్మానాన్ని ధూళిపాళ్ల ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యధికంగా అప్పుల భారం కలిగిన రైతులు ఏపీలోనే ఉన్నారన్నారు. రాష్ట్రంలో 93 శాతం మంది రైతులు అప్పుల ఊబిలో ఉన్నారని చెప్పారు.
రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది?
ఏపీలో సగటున ఒక్కో రైతుపై రూ.2.74లక్షల అప్పు ఉందని ధూళిపాళ్ల చెప్పారు. వైకాపా ప్రభుత్వం చెప్పిన రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందని నిలదీశారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రంలో 45లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తుంటే 15లక్షల ఎకరాలకే బీమా ఇచ్చారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. పెట్రోల్ ధరల భారం కారణంగా రైతులపై తీవ్రమైన భారం పడుతోందన్నారు. మోటార్లకు మీటర్లు పెడితే లాభమంటూ మంత్రులు వితండ వాదం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టబోమని తెలంగాణ స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. రైతులకు పెద్ద ఎత్తున మేలు చేస్తుంటే వారి జీవితాలు ఎందుకు బాగుపడలేదని ధూళిపాళ్ల నరేంద్ర నిలదీశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక తెదేపా హయాంలో రైతులకు ఉన్న పథకాలన్నీ ఆగిపోయాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు