జూన్ 30 నాటికి పూర్తి స్థాయిలో ఈ-కార్యాలయం
కలెక్టరేట్లో పూర్తి స్థాయిలో ‘ఈ-కార్యాలయం’ విధానం అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. కలెక్టరేట్లోని రెవెన్యూ అధికారులు, ఉద్యోగులతో ప్రకాశం భవన్లోని ఛాంబర్లో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్, చిత్రంలో జేసీ అభిషిక్త్ కిషోర్
చదలవాడ పశుక్షేత్రం అభివృద్ధికి చర్యలు: నాగులుప్పలపాడు, న్యూస్టుడే: చదలవాడ పశు క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. పశుక్షేత్రంలోని వసతులు, షెడ్లు, మాగుడు గడ్డి నిల్వలను ఆయన శుక్రవారం పరిశీలించారు. పశుక్షేత్రం ఏర్పాటు లక్ష్యం, పశు పోషణ, పిండ ఉత్పత్తి కేంద్రం నిర్వహణ తదితర అంశాలను కలెక్టర్కు పశుక్షేత్రం డిప్యూటీ డైరక్టర్ బి.రవి వివరించారు. మరింత సమర్థ నిర్వహణకు మరికొందరు కార్మికులు అవసరం ఉందని, అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపటాల్సి ఉందని విన్నవించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పైపులైన్లకు నష్టపరిహారం ఇప్పించాలని పశుక్షేత్రం డీడీ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భగా కలెక్టర్ గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ జేడీ బేబీరాణీ, అమూల్ నోడల్ అధికారి కాలేషా, ఎంపీడీవో కుసుమ కుమారి, తహసీల్దార్ హరిబాబు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్