ఎంపీ అయితే మాకేంటి..!
ఒంగోలులోని అగ్రహారం, సూరారెడ్డిపాలెం, టంగుటూరు, పాకల రైల్వే గేట్ల వద్ద వంతెనల నిర్మాణానికి సంబంధించి నిర్వహించిన కీలక సమావేశం అది. ఎంపీ పిలిస్తే పరుగెత్తుకుంటూ తాము హాజరుకావాలా అన్నట్లుగా ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు వ్యవహరించారు
రైల్వే పనులపై సమావేశానికి మున్సిపల్ అధికారుల డుమ్మా
చెత్త సేకరణ పర్యవేక్షకుడిని పంపి మమ
ఒంగోలు ట్రంకురోడ్డు, న్యూస్టుడే: ఒంగోలులోని అగ్రహారం, సూరారెడ్డిపాలెం, టంగుటూరు, పాకల రైల్వే గేట్ల వద్ద వంతెనల నిర్మాణానికి సంబంధించి నిర్వహించిన కీలక సమావేశం అది. ఎంపీ పిలిస్తే పరుగెత్తుకుంటూ తాము హాజరుకావాలా అన్నట్లుగా ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు వ్యవహరించారు. పదే పదే పిలిచినమీదట చివరకు ఓ ఒప్పంద ఉద్యోగిని పంపించి మమ అన్పించారు. శుక్రవారం ఇది చోటుచేసుకుంది. రైల్వే, ఆర్అండ్బి, మున్సిపల్ శాఖల అధికారులతో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలు రామ్నగర్లోని తన కార్యాలయంలో సమావేశం ఏర్పాటుచేశారు. మూడురోజుల క్రితమే సంబంధిత శాఖలకు సమాచారమిచ్చారు. విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్ల రైల్వే అధికారులతో పాటు అర్ అండ్ బి అధికారులు హాజరైనా ఒంగోలు కార్పొరేషన్ నుంచి ఎవరూ రాలేదు. ఎంపీ కార్యాలయం నుంచి పలుమార్లు ఫోన్చేస్తే అదిగో ఇదిగో అంటూ బదులిచ్చారు. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో తమ అధికారులంతా పాల్గొన్నారని తెలిపారు. ‘‘ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమస్య పరిష్కారం కోసం నేను ప్రయత్నిస్తుంటే, మీరిలా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ అండర్ బ్రిడ్జి నిర్మాణం జరిగి సమస్య పరిష్కారం కావడం మీకు అస్సలు ఇష్టం లేనట్లుంది’ అంటూ కార్పొరేషన్ అధికారుల తీరుపై ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విధంగా వ్యవహరించడం ఇది మూడోసారని వ్యాఖ్యానించారు. ,మూడేళ్ల క్రితం సహాయ కమిషనర్గా ఉద్యోగ విరమణ చేసి, ప్రస్తుతం ఒప్పంద ప్రాతిపదికన చెత్త సేకరణను పర్యవేక్షిస్తున్న డి.బ్రహ్మయ్యను ఎంపీ కార్యాలయానికి అధికారులు పంపారు. వారి తీరుపై ఎంపీ మనస్తాపానికి గురైనట్లు సమాచారం. పార్లమెంటరీ కమిటీకి ఫిర్యాదు చేయనున్నారని తెలిసింది. కాగా ఆయా ప్రాంతాల్లో అండర్ బ్రిడ్జిలు, వంతెనలు లేకపోవడం వల్ల ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారని.. వాటి నిర్మాణాలను సత్వరం ప్రారంభించి పూర్తి చేయాలని రైల్వే అధికారులకు ఎంపీ సూచించారు. ఆర్ అండ్ బి ఎస్ఈ విజయరత్నం, ఈఈ నాయక్, డీఈ షేక్ మహబూబ్, గిద్దలూరు రైల్వే ఏడీఈ జగదీష్, ఏఈఈ రజేంద్రప్రసాద్, నాగభూషణం(విజయవాడ), కార్పొరేటర్ చింతపల్లి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.
రైతు సంఘాల వినతి...
పొగాకు పండుగుల్ల అమ్మకం వేలం కేంద్రాల ద్వారానే జరిగేలా చర్యలు తీసుకోవాలని, బయట మార్కెట్లో గుల్ల విక్రయాలను నేరంగా పరిగణించాలని రైతు సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు ఎంపీ మాగుంటకు శుక్రవారం వినతి అందజేశారు. బయట విక్రయాలు చెల్లవని పొగాకు బోర్డు చట్టం చేయాలని..పార్లమెంటులో ప్రస్తావించాలని ఎంపీని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్