logo

క్రికెట్‌ ఫ్రాంచైజీగా సూర్య గ్రానైట్స్‌

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌కి అనుబంధంగా ఏర్పాటైన ఏపీఎల్‌ (ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌) క్రికెట్‌ ఫ్రాంచైజీగా చీమకుర్తికి చెందిన సూర్య గ్రానైట్స్‌, గుంటూరుకి చెందిన ఉదయ్‌ ఆసుపత్రి వారు ఓ టీంను దక్కించుకున్నారు. ఏపీఎల్‌కి సంబంధించి క్రీడాకారుల వేలం శుక్రవారం విశాఖపట్నంలో జరిగింది.

Published : 25 Jun 2022 03:15 IST


వేలంలో పాల్గొన్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

చీమకుర్తి, న్యూస్‌టుడే: ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌కి అనుబంధంగా ఏర్పాటైన ఏపీఎల్‌ (ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌) క్రికెట్‌ ఫ్రాంచైజీగా చీమకుర్తికి చెందిన సూర్య గ్రానైట్స్‌, గుంటూరుకి చెందిన ఉదయ్‌ ఆసుపత్రి వారు ఓ టీంను దక్కించుకున్నారు. ఏపీఎల్‌కి సంబంధించి క్రీడాకారుల వేలం శుక్రవారం విశాఖపట్నంలో జరిగింది. సూర్య గ్రానైట్స్‌, ఉదయ్‌ ఆసుపత్రి వారు కోస్టల్‌ రైడర్స్‌ జట్టుకి ఫ్రాంచైజీగా వ్యవహరిస్తూ వేలంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి శుక్రవారం జరిగిన వేలంలో పాల్గొన్నారు. 20 మంది క్రీడాకారులను కోస్టల్‌ రైడర్స్‌ జట్టు వారు కొనుగోలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని