విధి నిర్వహణకు వెళుతూ..
ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ లారీ ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటన మద్దిపాడు మండలం సీతారాంపురం కొష్టాలుసెంటర్ వద్ద జాతీయ రహదారి పై శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలియజేసిన వివరాల మేరకు...
పావని (పాత చిత్రం)
మద్దిపాడు, న్యూస్టుడే: ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ లారీ ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటన మద్దిపాడు మండలం సీతారాంపురం కొష్టాలుసెంటర్ వద్ద జాతీయ రహదారి పై శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలియజేసిన వివరాల మేరకు...ఒంగోలు కమ్మపాలెనికి చెందిన నీల పావని (25), ఒంగోలు మండలం పెళ్లూరుకు చెందిన వెన్నెల స్థానికంగా ఓ ప్రైవేటు బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నారు. మేదరమెట్లలో నూతనంగా బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఇద్దరూ ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సీతారాంపురం వద్ద కంటైనర్ లారీ వీరి బైక్ను ఢీ కొట్టింది. ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరూ లారీ కింద పడ్డారు. పావని అక్కడికక్కడే మృతి చెందింది. వెన్నెల కాళ్లపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో రెండు కాళ్లు తెగిపోయాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్కు తరలించారు. పావని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించి కేసు నమోదు చేశారు. ● పావని తల్లిదండ్రులు ఒంగోలులోని కమ్మపాలెంలో నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు సంతానం. వారిలో ముగ్గురు అమ్మాయిలు, అబ్బాయి ఉన్నారు. చివరి అమ్మాయి పావని విద్యాభ్యాసం అనంతరం ప్రైవేటు బ్యాంకులో విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. విధి నిర్వహణకు వెళుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆవేదనకు అంతే లేకుండా పోయింది.
ఉరి వేసుకొని గృహిణి ఆత్మహత్య
గిద్దలూరు పట్టణం, న్యూస్టుడే : గిద్దలూరు మండలం మోడంపల్లె గ్రామంలో శుక్రవారం ఓ గృహిణి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మోడంపల్లె గ్రామానికి చెందిన కప్పల రాంబాబుకు తిమ్మాపురం గ్రామానికి చెందిన మేకల తిరుపాలు కుమార్తె భవాని(28)ని ఇచ్చి 8 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. భర్త రాంబాబు తల్లిదండ్రులతో కలసి హైదరాబాదులో నివాసముంటున్నారు. భవాని మోడంపల్లె గ్రామంలో నివాసం ఉంటోంది. భర్త తనను హైదరాబాద్కు తీసుకువెళ్లాలని కోరినప్పటికీ తీసుకెళ్లపోవడంతో మస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భవాని తండ్రి మేకల తిరుపాలు ఫిర్యాదు మేరకు ఎస్ఐ బ్రహ్మనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా