logo

మహిళలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు

తనను రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక మహిళలను అడ్డం పెట్టుకుని కొందరు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఒంగోలు నగరంలో ఆయన శుక్రవారం పర్యటించారు. ఈ సం

Published : 25 Jun 2022 03:15 IST

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: తనను రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక మహిళలను అడ్డం పెట్టుకుని కొందరు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఒంగోలు నగరంలో ఆయన శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జనసేనకు చెందిన ఓ మహిళా నాయకురాలితో తాను మద్యం మత్తులో మాట్లాడానంటూ కొన్ని టీవీ ఛానెళ్లు(ఈటీవీ కాదు), సామాజిక మాధ్యమాలు దుష్ప్రచారం చేయటం దారుణమన్నారు. దీనిపై కేసులు నమోదు చేస్తే అందుకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తామంటున్నారనీ, ఇటువంటి సంఘటనలు గతంలో ఎప్పుడైనా చూశామా అని అన్నారు. తనను నేరుగా ఎదుర్కొనలేక ఇప్పుడు జనసేన, గతంలో అల్లూరుకు చెందిన మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని బాలినేని అన్నారు. ప్రతి విషయంలోనూ తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుంటున్నారని.. అతను చేసిన నేరాలేంటో చెప్పాలని ప్రశ్నించారు. ఎవరేం అనుకున్నా తగ్గేదేలేదనీ, ఈ రెండేళ్లూ ఒంగోలులో ప్రజల మధ్యనే ఉండి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తామని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని