AP minister suresh: మంత్రి ఆదిమూలపు సురేశ్‌కి మరోసారి అస్వస్థత

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు ఉదయపు నడకలో ఒక్కసారిగా కిందపడిపోయారు.

Published : 25 Jun 2022 12:46 IST

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు ఉదయపు నడకలో ఒక్కసారిగా కిందపడిపోయారు. మార్కాపురంలోని తన కళాశాలలో ఉదయం వాకింగ్‌ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో వైద్యులు వెంటనే కళాశాలకు చేరుకుని సురేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీలో హెచ్చుతగ్గుల వల్లే ఆయన కిందపడినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కళాశాలలోనే మంత్రి సురేశ్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు.

కొన్ని రోజుల క్రితం మంత్రి సురేశ్‌ అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు యాంజియోగ్రామ్‌ పరీక్షలు నిర్వహించి స్టంట్‌ వేశారు. ఆ తర్వాత ఇంటికొచ్చిన సురేశ్‌ ఇప్పుడు మరోసారి అస్వస్థకు గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని