ప్రాణాలు తీసిన యమపాశాలు
ఇంటి మేడ పైకి ఎక్కి విద్యార్థులంతా సరదాగా ఆటలాడుకుంటున్నారు. ఉరుకులు పరుగులు పెడుతున్న ఆ చిన్నారులను చూసి విధికి కన్ను కుట్టినట్లైంది. విద్యుత్తు ప్రమాదం రూపంలో
ఆటలాడుతుండగా తీగలు తగిలి విద్యార్థి
మైక్కు విద్యుత్తు ప్రసరించి మత బోధకుడు
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
ఇంటి పైనున్న విద్యుత్తు తీగ వద్ద విగతజీవిగా విద్యార్థి
కనిగిరి, న్యూస్టుడే: ఇంటి మేడ పైకి ఎక్కి విద్యార్థులంతా సరదాగా ఆటలాడుకుంటున్నారు. ఉరుకులు పరుగులు పెడుతున్న ఆ చిన్నారులను చూసి విధికి కన్ను కుట్టినట్లైంది. విద్యుత్తు ప్రమాదం రూపంలో ఒకరి ప్రాణాలను బలిగొంది. ఈ విషాద సంఘటన కనిగిరి నగర పంచాయతీలోని శంఖవరంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై దాసరి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. శంఖవరం గ్రామానికి చెందిన కడప వెంకటేశ్వర్లు, ఈశ్వరమ్మల కుమారుడు మారుతీ మహేంద్ర(10). స్థానికంగా ఉన్న పాఠశాలలో అయిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో అదే ఊళ్లోని మరో నలుగురు మిత్రులతో కలిసి దాగుడు మూతలు ఆడుకునేందుకు ఉపక్రమించాడు. ఇందుకుగాను సమీపంలో ఉన్న శంకర్ అనే వ్యక్తికి చెందిన మేడ పైకి ఎక్కారు. ఆటలాడుకుంటున్న సమయంలో మేడ మీదుగా వెళ్తున్న వ్యవసాయ విద్యుత్తు తీగకు మారుతీ మహేంద్ర చెయ్యి తగిలింది. దీంతో అతను విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీగ నుంచి విడిపించుకునేందుకు రెండో చెయ్యి కూడా ఉపయోగించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇతర విద్యార్థులు ఇంటిని ఆనుకుని ఉన్న వరిగడ్డి వామి పైకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
మారుతీ మహేంద్ర (పాత చిత్రం)
రూ. 5 లక్షలిస్తే తొలగిస్తామన్నారు...
ఇళ్ల పైనుంచి వెళ్తున్న విద్యుత్తు తీగలను తొలగించాలని గ్రామస్థులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులకు అర్జీలు కూడా అందజేశారు. రూ. 5 లక్షల నిధులు సమకూరిస్తే స్తంభాలు, తీగలు తొలగిస్తామని చెప్పడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. ప్రస్తుతం విద్యార్థి మృతికి విద్యుత్తు శాఖే కారణమని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై అక్కడికి వచ్చిన అధికారులు, సిబ్బందిని నిలదీశారు. అర్జీలు ఇచ్చినప్పుడే తీగలు తొలగించి ఉంటే తన కుమారుడు మృతి చెందేవాడే కాదంటూ విద్యార్థి తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, ఈశ్వరమ్మ రోదించడం పలువురితో కంట నీరు పెట్టించింది. ప్రమాద విషయం తెలుసుకున్న నగర పంచాయతీ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, వార్డు సభ్యురాలు పెన్నా నాగమ్మ, వైకాపా, తెదేపా నాయకులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ప్రార్థనా మందిరానికి ఆహ్వానిస్తూ...
రాంబాబు మృతదేహం
పుల్లలచెరువు, న్యూస్టుడే: మండలంలోని మానేపల్లి గ్రామానికి చెందిన కొండా రాంబాబు(46) అదే గ్రామంలో మత ప్రబోధకుడిగా జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఆరాధన ఉండటంతో చర్చిలోకి వెళ్లారు. సంఘస్థులను ఆహ్వానించే ముందుగా దైవ ప్రార్థన చేసేందుకు మైక్ తీసుకున్నారు. ఈ సమయంలో మైక్కు అమర్చిన తీగలకు విద్యుత్తు ప్రసరించి కింద పడిపోయారు. స్థానికులు అక్కడికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు. రాంబాబుకు భార్య, నలుగురు పిల్లలున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వేముల సుధాకర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.