వలస కూలీలకు శాపం
‘జగనన్న అమ్మఒడి’ పథకానికి ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా విధించిన నిబంధన ప్రభావం వలస కూలీలపై పడింది. పాఠశాల జరిగిన పనిదినాల్లో 75శాతం హాజరును తప్పనిసరి చేయడంతో ఈ పరిస్థితి
ఎస్సీ కుటుంబాల్లోని పిల్లలకు అందని ‘అమ్మఒడి’
75 శాతం హాజరు నిబంధనతో అనర్హత
గుర్రపుశాలకు చెందిన ఎం.శైలజకు 78శాతం హాజరు ఉన్నట్లు
పాఠశాల ప్రిన్సిపల్ ఇచ్చిన ద్రువీకరణ పత్రం
యర్రగొండపాలెం, న్యూస్టుడే: ‘జగనన్న అమ్మఒడి’ పథకానికి ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా విధించిన నిబంధన ప్రభావం వలస కూలీలపై పడింది. పాఠశాల జరిగిన పనిదినాల్లో 75శాతం హాజరును తప్పనిసరి చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. తాజాగా వచ్చిన అనర్హుల జాబితాలో ఇలాంటి కుటుంబాలు ఎక్కువగా ఉన్న గ్రామ సచివాలయాల పరిధిలో చాలా మంది ‘అనర్హత’ జాబితాలోకి వెళ్లారు. దీంతో ఈ పథకం వర్తించకుండా పోయింది.
* పిల్లలతో పాటే కూలీ పనులకు: కరవు ప్రాంతం కావడంతో సరైన వ్యవసాయ పనుల్లేక ఎస్సీ కాలనీల్లో ఎక్కువమంది చెరకు కోత పనికి వెళ్తుంటారు. పాఠశాలల పనిదినాల్లోనే ఈ పనులు సాగుతాయి. సుదూర ప్రాంతాలకు పనికి వెళ్లి అక్కడే నాలుగైదు నెలలు ఉండి వస్తుంటారు. ఇంటివద్ద పెద్దలు, వృద్ధులు లేని కుటుంబాల్లోని చిన్నారులు తల్లిదండ్రులతో పాటే వలస వెళ్తుంటారు. ఈ క్రమంలో పాఠశాలలకు సగం రోజులే హాజరు అవుతుంటారు. ప్రభుత్వం ఈ ఏడాది పెట్టిన కొత్త నిబంధనల వీరికి పథకాన్ని దూరం చేసింది. గత నెలలో వచ్చిన అమ్మ ఒడి జాబితాలో అనర్హులకు సరైన సమాచారం లేకపోవడంతో చాలామంది తమ ఆధారాలతో వినతులు ఇవ్వలేకపోయారు. ఇప్పటికీ ఏవైనా కారణాలతో అనర్హత జాబితాలో ఉన్నవారు తమ ఆధారాలతో సచివాలయాల్లో అర్జీ ఇవ్వొచ్చని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
* వై.పాలెం మండలం వీరభద్రాపురం సచివాలయం పరిధిలో హాజరు తక్కువగా ఉందని 28మంది అనర్హులుగా తేలారు. వీరిలో వలస కూలీలకు వెళ్లే ఎస్సీ కుటుంబాలవారే దాదాపు 22మంది ఉన్నారు. చాలా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది.
* వై.పాలెం మండలం గుర్రపుశాలకు చెందిన మామిళ్ల శైలజ త్రిపురాంతకం మండలం దూపాడు లోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. గడిచిన విద్యా సంవత్సరానికిగాను 197 రోజుల పనిదినాలు జరిగాయి. సదరు విద్యార్థిని 153 రోజులు బడికి హాజరైంది. దీంతో హాజరు 78 శాతంగా ఉంది. తాజాగా ప్రకటించిన జాబితాలో బాలిక హాజరు 75 శాతం కన్నా తక్కువ ఉందని అనర్హుల జాబితాలో పేరొచ్చింది. దీంతో ప్రభుత్వానికి అర్జీ ఇచ్చేందుకు గాను పాఠశాల నుంచి హాజరు ద్రువపత్రాన్ని తెచ్చుకోవాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM