‘హామీలన్నింటినీ నెరవేరుస్తాం’
వైకాపాకు మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవత్ గీతా లాంటిదని సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఆదివారం వై.పాలెం
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగ నాగార్జున (చిత్రంలో మంత్రి సురేష్,
ఎంపీ మాగుంట, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, ఎమ్మెల్యేలు బుర్రామధుసూదనయాదవ్,
అన్నారాంబాబు, నాగార్జునరెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ వెంకాయమ్మ తదితరులు)
యర్రగొండపాలెం పట్టణం, న్యూస్టుడే : వైకాపాకు మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవత్ గీతా లాంటిదని సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఆదివారం వై.పాలెం నియోజకవర్గ వైకాపా ప్లీనరీ సమావేశం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నాగార్జున మాట్లాడుతూ సీఎం సంక్షేమ, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగిస్తున్నారని, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తారని పేర్కొన్నారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ పదవుల్లో మాజీ మంత్రి బాలినేని, పిన్నాళ్ల వంటి నాయకులు వెనక్కు తగ్గి బడుగు, బలహీన వర్గాలకు అవకాశాలు కల్పించారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ఈ ఏడాదిలో పూర్తి చేస్తామని తెలిపారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు నిధులు అధికంగా ఖర్చు చేస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్లు కట్టించిన ఘనత సీఎందే నన్నారు. చంద్రబాబునాయుడు ఏ కులానికి, ఏ మతానికి గానీ ఏమి చేయలేదని విమర్శించారు. జడ్పీ ఛైర్పర్సన్ వెంకాయమ్మ మాట్లాడుతూ పార్టీలో విభేదాలుంటే సర్దుకొని పోవాలని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ పార్టీని గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే బుర్రామధుసూదనయాదవ్, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, గిద్దలూరు, మార్కాపురం శాసనసభ్యులు అన్నారాంబాబు, నాగార్జునరెడ్డిలు మాట్లాడారు. ముందుగా వైకాపా జిల్లా అధ్యక్షుడు బుర్రామధుసూదనయాదవ్ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టు, టీ5 కాలువ, పెండింగ్లో ఉన్న హైదరాబాద్ నేషనల్ హైవే రహదారి, పుల్లలచెరువు మండలం చేపలమడుగులో విద్యుత్తు సబ్స్టేషన్లు పూర్తి చేసేందుకు తీర్మానాలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్