అమరావతిలో ప్లాట్ల పేరిట మోసం
ఎస్పీకి మార్కాపురం రైతుల ఫిర్యాదు
ఫిర్యాదిదారులతో మాట్లాడుతున్న ఎస్పీ మలికా గార్గ్
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: అమరావతిలో ప్లాట్లు, అపార్టుమెంట్ల పేరిట తమను మోసగించారంటూ మార్కాపురం ప్రాంతానికి చెందిన పలువురు బాధితులు... పోలీసు స్పందనలో జిల్లా ఎస్పీ మలికా గార్గ్కు సోమవారం ఫిర్యాదు చేశారు. మార్కాపురం ప్రాంతానికి చెందిన పలువురు మిర్చి రైతులు... బిరుదులనరవ గ్రామానికి చెందిన శ్రీదేవి ట్రేడర్స్లో రావి వెంకటరెడ్డి ద్వారా విక్రయాలు జరిపేవారు. ఈ లావాదేవీల్లో భాగంగా కొంత నగదు ఇచ్చి మరికొంత నగదుకు ప్రామిసరీ నోట్లు రాసిచ్చేవారు. ఈక్రమంలో తమ బంధువులు రాజధాని అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని నమ్మబలికి... రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని పెట్టుబడి పేరిట పెట్టించారు. సదరు నగదుకు సంబంధించి తమకు ఎటువంటి సమాధానం చెప్పడం లేదని... న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. ● తన కుమారుడితో పాటు మరికొందరికి హౌసింగ్ బోర్డులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసగించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని... పొదిలికి చెందిన దర్శి సుబ్బారావు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఒంగోలుకు చెందిన రాజేంద్ర కుమార్... హౌసింగ్ బోర్డులో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తామని రూ.లక్ష తీసుకుని మోసగించినట్లు చెప్పారు. ● ఒంగోలు నేతాజీనగర్లో ఫ్లాట్ ఇప్పిస్తానని వెంకటేశ్వరనగర్కు చెందిన కోడూరి హరిబాబు అనే వ్యక్తి రూ.50 వేలు తీసుకున్నాడని... ఫ్లాట్ ఇప్పించకుండా, అదేమని అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నాడని... ఒంగోలుకు చెందిన శ్యామల అనే మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ● పోలీసు స్పందన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 73 మంది హాజరై తమ సమస్యలు తెలియజేశారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, అదనపు ఎస్పీ (క్రైమ్) ఆర్.శ్రీధర్రావు, ట్రాఫిక్ డీఎస్పీ మల్లికార్జునరావు, ఎస్బీ ఎస్పీ బి.మరియదాస్, ఎస్బీ-1 సీఐ రాఘవేంద్ర, న్యాయ సలహాదారు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Gorantla madhav: మాధవ్ వీడియో ఒరిజినల్ కాదు.. అసలు వీడియో దొరికితేనే క్లారిటీ: అనంతపురం ఎస్పీ
-
Movies News
Naga Chaitanya: జీవితంలో ఏం జరిగినా ఆనందంగా స్వీకరించాలి: నాగచైతన్య
-
India News
Viral Video: పెద్దోళ్లు పట్టించుకోలేదు.. పసిపిల్లలు చేయందించారు..
-
India News
Nitish kumar: 2014లో మోదీ విన్నరే.. 2024లో గెలుస్తారా?: నీతీశ్
-
India News
Varun Gandhi: జెండాల కొనుగోలుకు పేదల తిండి లాక్కోవడమా..?
-
Sports News
Team India: భారత జట్టుకు అలాంటి ఆటగాళ్లే కావాలి: మాజీ క్రికెటర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి: నాగచైతన్య
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Langya virus: చైనాలో జంతువుల నుంచి మరో కొత్తవైరస్ వ్యాప్తి
- Balineni Srinivasa Reddy: బాలినేని జనసేనకు వెళ్తున్నారా? క్లారిటీ ఇచ్చిన మాజీమంత్రి