ఇంటర్ సరే.. బోధకులేరీ!
బాలికలకు ఉన్నతవిద్య దరిచేర్చేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)లో ఇంటర్మీడియట్ కోర్సులు ప్రారంభమవుతున్నాయి. మొత్తం 37 కేజీబీవీలకు గాను 14 చోట్ల ఇప్పటికే ఇంటర్ తరగతులు కొనసాగుతున్నాయి. మి
37 కేజీబీవీల్లో ప్రవేశాలకు ఏర్పాట్లు
- న్యూస్టుడే, ఒంగోలు నగరం
బాలికలకు ఉన్నతవిద్య దరిచేర్చేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)లో ఇంటర్మీడియట్ కోర్సులు ప్రారంభమవుతున్నాయి. మొత్తం 37 కేజీబీవీలకు గాను 14 చోట్ల ఇప్పటికే ఇంటర్ తరగతులు కొనసాగుతున్నాయి. మిగిలిన 23 చోట్ల కూడా ఈసారి మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతవరకు బాగానే ఉన్నా గతంలో మాదిరి బోధకుల కొరత లేకుండా తగిన ఏర్పాట్లుచేస్తేనే ఆశించిన లక్ష్యం నెరవేరుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పదోతరగతి ఉత్తీర్ణులైన బాలికలందరికీ ఉన్నత విద్య అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నుంచి జులై 12 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు అధికారి బి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొన్ని కేంద్రాలకు వృత్తి విద్యా కోర్సులు కేటాయించారు. అక్కడ సాధారణ కోర్సులు ఉండవు. సాధారణంగా కేజీబీవీల్లో ఇంటర్ బోధించేవారిని పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ)గా పిలుస్తారు. పీజీ ఉత్తీర్ణులను నియమించి నెలకు రూ.12 వేల వేతనం ఇస్తుంటారు. తక్కువ వేతనం కావడంతో ఆ పోస్టుల్లో చేరినవారు కొద్దిరోజుల తరువాత విరమించుకుంటున్నారు. మూడేళ్లుగా 14 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ తరగతులు కొనసాగుతున్నా పూర్తిస్థాయిలో బోధకులు లేరు. గత ఏడాది సమస్య మరింత జఠిలమైంది. పరీక్షలకు మూడు నెలల ముందు 45 పోస్టుల భర్తీకి ప్రకటన ఇవ్వగా 200 మంది దరఖాస్తు చేసుకున్నారు. మౌఖిక పరీక్షల దశలో ప్రభుత్వం నియామకాలు నిలిపివేయడంతో విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడింది. ఆ తర్వాత గంటల పద్ధతిలో అతిథి అధ్యాపకులను నియమించుకోవాలని ఎస్పీడీ సూచించినా అర్హులు లేక ఆచరణకు నోచుకోలేదు. దీనివల్ల జూనియర్ ఇంటర్లో 36 శాతం, సీనియర్ ఇంటర్లో 59 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గతంలో ఎప్పుడూ ఈ తరహా పరిస్థితి ఎదురుకాలేదు.
165 మంది అవసరం
ఇంటర్ బోధనకు ఒక్కో కేజీబీవీకి అయిదుగురు అవసరం. ఆ విధంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్నవారు పోను 165 మందిని నియమించాలి. ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ప్రవేశాలు మాత్రం ప్రారంభించారు. దీనిపై ఏపీసీ బి.శ్రీనివాసరావును సమాచారం కోరగా సోమవారం జరిగిన సమావేశంలో పీజీటీ పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తామని చెప్పారన్నారు. అన్ని చోట్ల వసతిగృహ సౌకర్యం ఉంటుందని..అనాథలు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ, ఓసీలకు వరుస క్రమంలో ప్రాధాన్యమిచ్చి ప్రవేశాలు కల్పిస్తామన్నారు.
ఆ కేంద్రాల్లో వృత్తి విద్యాకోర్సులు
కొత్తగా మంజూరైన కేంద్రాల్లో కొన్నిచోట్ల కేవలం వృత్తి విద్య కోర్సులనే ప్రవేశపెట్టారు. గుడ్లూరులో ఎంపీహెచ్డబ్ల్యూ, కందుకూరులో అగ్రికల్చర్, కురిచేడులో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, హెచ్ఎం పాడులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మార్కాపురం(రాయవరం)లో అకౌంటింగ్, టాక్సేషన్ కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన చోట్ల సంప్రదాయ గ్రూపులు ఎంపీసీ, బైబీసీ, హెచ్ఈసీ, సీఈసీలో ప్రవేశాలు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!