స్వచ్ఛ విద్యాలయాలు 38
స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 38 పాఠశాలలు ఎంపికయ్యాయి. అన్ని విభాగాల్లోనూ ఎనిమిది చోటు సంపాదించగా.. 30 పాఠశాలలు సబ్ కేటగిరీలో ఎంపికయ్యాయి. కొవిడ్
1న జిల్లా స్థాయి అవార్డుల ప్రదానం
యర్రగొండపాలెం మండలం మురారిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల
ఒంగోలు నగరం, న్యూస్టుడే: స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 38 పాఠశాలలు ఎంపికయ్యాయి. అన్ని విభాగాల్లోనూ ఎనిమిది చోటు సంపాదించగా.. 30 పాఠశాలలు సబ్ కేటగిరీలో ఎంపికయ్యాయి. కొవిడ్ కారణంగా గడిచిన మూడేళ్లలో జిల్లా నుంచి ఎలాంటి ప్రతిపాదనలు లేకపోయాయి. ఈ ఏడాది ఉమ్మడి ప్రకాశంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి 4305 పాఠశాలల వివరాలను స్వచ్ఛ విద్యాలయం యాప్లో నమోదు చేశారు. తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, నీటి ప్రవాహం, పచ్చదనం, కొవిడ్ జాగ్రత్తల అమలు వంటి ఆరు అంశాల్లో బాగున్న వాటిని ఓవరాల్ అవార్డు కింద ఎంపిక చేశారు. వీటిని రాష్ట్రస్థాయి పోటీలకూ పంపుతారు. ఆరింటిలో ఒక్కో కేటగిరీ కింద 5 పాఠశాలలు ఎంపిక చేశారు. సబ్ కేటగిరీ కింద మొత్తం 30 పాఠశాలలు జిల్లా స్థాయి అవార్డుకు ఎంపికయ్యాయి. అవార్డులన్నీ ప్రభుత్వ పాఠశాలలకే దక్కడం విశేషం. జులై 1న సాయంత్రం 3 గంటలకు స్పందన భవన్లో నిర్వహించే కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఓవరాల్ అవార్డ్ కేటగిరీలో ఎంపికైతే సమగ్రశిక్ష సంస్థ ద్వారా అదనంగా రూ.60 వేలు స్కూల్ గ్రాంట్లో కలిపి ఇస్తారు. సబ్ కేటగిరీలో వాటికి రూ.20 వేలు అందజేస్తారు.
ఓవరాల్ అవార్డుకు ఎంపికైనవి..: మురారిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల(యర్రగొండపాలెం), గుండాయిపాలెం, బాలాజీ నగర్(ఒంగోలు), పేరంగుడిపల్లి(కనిగిరి),
ఉన్నత పాఠశాలలు: చవిటిపాలెం(సంతమాగులూరు), ముండ్లపాడు(గిద్దలూరు), యర్రగొండపాలెం(యర్రగొండపాలెం), బండ్లమిట్ట(ఒంగోలు)
సబ్ కేటగిరీ కింద ఎంపికైనవి...: ప్రకాశం బాలికల పాఠశాల, ఎంపీయూపీఎస్, తిమ్మాయిపాలెం(అద్దంకి), కాకర్ల(అర్థవీడు), యర్రగుడిపాడు(చీమకుర్తి), తురిమెళ్ల(కంభం), శేషంవారిపల్లి, దర్శి, దర్శి పశ్చిమ ఉన్నత, ప్రాథమిక(దర్శి), గిద్దలూరు ఉన్నత, గిద్దలూరు ఆరో వార్డులోని ప్రాథమిక, పొట్లూరు ప్రాథమికోన్నత పాఠశాల(గిద్దలూరు), కోటతిప్పలపలి ్ల(హనుమంతునిపాడు), మహదేవపురం(కందుకూరు), కేజీబీవీ(కందుకూరు)ఉన్నాయి. అలాగే ఇడమకల్లు ప్రాథమికోన్నత(కొమరోలు), మూగచింతల(కొండపి), దైవాలరావూరు(కొరిశపాడు), ఒకటో వార్డు ప్రాథమిక పాఠశాల, పీఎస్ కాలనీ జడ్పీ బాలికల పాఠశాల(మార్కాపురం), బొబ్బేపల్లి, జొన్నతాళి(మార్టూరు), పెదవారిమద్ది(పీసీపల్లి), ఓబులక్కపల్లి(పెద్దారవీడు), యానాదికాలనీ(పొదిలి), వెలకగపూరి(టంగుటూరు), అంకభూపాలపల్లి(వలేటివారిపాలెం), పండువ నాగులవరం(వెలిగండ్ల), పందిళ్లపల్లి(వేటపాలెం) ఎంపికయ్యాయి.
ఒంగోలు బాలాజీనగర్ ప్రాథమికోన్నత పాఠశాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!