logo

వివాదం.. తల్లీ కుమార్తె విషాదాంతం

కుటుంబ కలహాలతో తల్లీ కూతుళ్లు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన మర్రిపూడి మండలం రేగలగడ్డలో మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన

Updated : 29 Jun 2022 02:41 IST

విగతజీవులుగా చిన్నక్క, అశ్వని

మర్రిపూడి, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో తల్లీ కూతుళ్లు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన మర్రిపూడి మండలం రేగలగడ్డలో మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రేగలగడ్డకు చెందిన కారంపూడి చలమయ్య, చిన్నక్క(50) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. చలమయ్య కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. ఏడాది క్రితం చిన్న కూతురు అశ్వని(25)కి వివాహం చేశారు. దంపతులిద్దరూ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం ఆమె పుట్టింటికి వచ్చింది. ఇటీవల ఇంట్లో చిన్నపాటి వివాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో చిన్నక్క, అశ్వని సోమవారం రాత్రి కనిపించలేదు. వారి ఆచూకీ కోసం గ్రామస్థులతో కలిసి కుమారుడు చంద్రశేఖర్‌ పరిసర ప్రాంతాల్లో గాలించారు. తల్లీ కుమార్తెల మృతదేహాఆలను గ్రామ సమీపంలోని బావిలో మంగళవారం తెల్లవారుజామున గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్సై అంకమ్మరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుమారుడు చంద్రశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని