పెద్దల అండ... కరిగిపోతున్న కొండ
ఆ ప్రాంతం ప్రభుత్వ భూమని, అక్కడి నుంచి నిత్యం వేల టన్నుల ఎర్రమట్టి వివిధ రూపాల్లో తరలిపోతోందని అందరికీ తెలుసు. అయినప్పటికీ మైనింగ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది కన్నెత్తి చూడని పరిస్థితి.
ఎర్రమట్టి అక్రమ రవాణాపై అధికారుల నిర్లిప్త ధోరణి
న్యూస్టుడే, టంగుటూరు
జేసీబీతో గ్రావెల్ను తవ్వి టిప్పర్లో పోస్తున్న దృశ్యం
ఆ ప్రాంతం ప్రభుత్వ భూమని, అక్కడి నుంచి నిత్యం వేల టన్నుల ఎర్రమట్టి వివిధ రూపాల్లో తరలిపోతోందని అందరికీ తెలుసు. అయినప్పటికీ మైనింగ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది కన్నెత్తి చూడని పరిస్థితి. కొందరు రాజకీయ నాయకుల కనుసన్నల్లో జరుగుతున్న ఈ ఎర్రమట్టి అక్రమ రవాణాలో అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తుండటం శోచనీయం. మండలంలోని కొణిజేడు, కందులూరు, మర్లపాడు గ్రామాల్లో విస్తరించి ఉన్న కొండ పోరంబోకు భూముల్లోని ఎర్రమట్టి తరలింపు యథేచ్ఛగా జరుగుతోంది.
రాత్రి, పగలు తేడా లేకుండా....
మూడు గ్రామాల్లోనూ దాదాపు 500 ఎకరాల్లో ఎర్రమట్టి కొండలు విస్తరించి ఉన్నాయి. తవ్వకాలకు అనుమతులు లేని ఈ ప్రాంతం నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా భారీ వాహనాలతో మట్టిని తరలిస్తున్నారు. నిత్యం వందల టిప్పర్లలో ఒంగోలు, సంతనూతలపాడు, చీమకుర్తి, కొండపి, టంగుటూరు, జరుగుమల్లి ప్రాంతాలకు మట్టి రవాణా జరుగుతోంది. దూరాన్ని బట్టి ఒక్కో టిప్పర్ రూ.5 వేల నుండి విక్రయిస్తున్నారు. ఇటీవల జగనన్న కాలనీ లేఅవుట్లకు మెరక తోలకం పేరుతో కొండ ప్రాంతాన్ని తవ్వి గ్రావెల్ తరలించడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి.
మైనింగ్ అధికారులు ఎక్కడ.....
కొండ ప్రాంతాల నుండి ప్రభుత్వ కార్యాలయాలకు గ్రావెల్ తీసుకెళ్లాలన్నా.. మైనింగ్ అధికారుల అనుమతులు తప్పనిసరి. వారు ఇచ్చిన కొలతల ఆధారంగా మాత్రమే తవ్వి తీసుకెళ్లాలి. అయితే ఇక్కడ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు కనిపించని పరిస్థితి. ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్నారని తెలిసినా, పట్టపగలే లారీలు వెళ్తున్నా గ్రామాల రెవెన్యూ అధికారులు ప్రశ్నించే పరిస్థితి లేదు. అక్రమ తవ్వకాలపై పంచాయతీల అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు.
తవ్వకాలపై కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తెలిపేలా ఏర్పాటు చేసిన బోర్డు
కొందరు నాయకులే సూత్రధారులు...
కందులూరు, మర్లపాడు, యరజర్ల కొండ ప్రాంతాల్లో గ్రావెల్ తరలింపునకు అధికార పార్టీకి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి బంధువు, వల్లూరు గ్రామానికి చెందిన ఓ కాంట్రాక్టరు, కందులూరుకు చెందిన అధికార పార్టీ నాయకుడు సూత్రధారులని స్థానికులు చెబుతున్నారు. అందువల్లనే మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచ్చలవిడిగా కొండలు తవ్వడంతో పర్యావరణం దెబ్బతింటోందని, పశువుల మేతకు కొండ ప్రాంతాలే దిక్కని కాపరులు వాపోతున్నారు.
కేసులు నమోదు చేయిస్తాం..
యరజర్ల ప్రాంతంలో కొంత తవ్వేందుకు అనుమతులు ఉన్నాయి. మిగిలిన చోట్ల ఇవ్వలేదు. అనుమతులు ఉన్నప్పుడు నచ్చిన చోటికి తరలించే అధికారం ఉంటుంది. అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు సమాచారం అందితే విజిలెన్స్ అధికారులను అప్రమత్తం చేస్తాం. కేసులు నమోదు చేయిస్తాం. నాలుగు నెలల క్రితం రెవెన్యూ అధికారులు నాలుగు టిప్పర్లను అదుపులోకి తీసుకొని టంగుటూరు పోలీస్ స్టేషన్కు అప్పగించారు.
- రవికుమార్, మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం