logo

పీపుల్స్‌వార్‌ పేరిట బెదిరింపు లేఖ

పీపుల్స్‌వార్‌ దళం పేరిట రూ.5 లేదా రూ.3 లక్షలు నగదు ఇవ్వాలంటూ మంగళవారం తన దుకాణం వద్ద లేఖ దొరికిందని రఘుపతి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సింగరాయకొండ

Published : 29 Jun 2022 06:18 IST

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పీపుల్స్‌వార్‌ దళం పేరిట రూ.5 లేదా రూ.3 లక్షలు నగదు ఇవ్వాలంటూ మంగళవారం తన దుకాణం వద్ద లేఖ దొరికిందని రఘుపతి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సింగరాయకొండ ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఫొటో స్టూడియో నిర్వహిస్తున్న గ్రామానికి చెందిన రఘుపతికి దళం సభ్యుడు వెంకటరెడ్డి పేరిట లేఖ వచ్చింది. దళ సభ్యుడు అనారోగ్యం చెందాడని కొంతకాలంగా పామూరు, మాలకొండ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నామని, ఆర్థిక సాయం చేయాలని అందులో ఉంది. లేకపోతే స్టూడియో, నివాసంపై దాడి చేసి చంపుతామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై సీఐ లక్ష్మణ్‌ మాట్లాడుతూ కేసు నమోదు చేశామన్నారు. లేఖ నిజంగా పీపుల్స్‌ వార్‌ దళం నుంచి వచ్చిందా, లేక ఆకతాయిల పనా అనే విషయంపై దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని