సొంత వారే తప్పులు ఎత్తి చూపితే దామచర్లపై విమర్శలా!
సొంత పార్టీ నాయకులే ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతుంటే ఓర్వలేక... ప్రతిపక్ష తెదేపాపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కసు వెళ్లగక్కడం ఎంతవరకు సమంజసమని ఏఎంసీ మాజీ ఛైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు.
బాలినేనిపై తెదేపా నాయకుల ధ్వజం
మాట్లాడుతున్న ఏఎంసీ మాజీ ఛైర్మన్ శ్రీనివాసరావు, చిత్రంలో నాయకులు శశికాంత్, నాగేశ్వరరావు, పద్మజ తదితరులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: సొంత పార్టీ నాయకులే ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతుంటే ఓర్వలేక... ప్రతిపక్ష తెదేపాపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కసు వెళ్లగక్కడం ఎంతవరకు సమంజసమని ఏఎంసీ మాజీ ఛైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై బాలినేని చేస్తున్న ఆరోపణలు ఖండించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గుప్తాపై వైకాపా నాయకుల దాడి, జనసేన నాయకురాలు రాయపాటి అరుణకు అర్ధరాత్రి వేళ ఫోన్ చేయడం, కొత్తపట్నం మండలం అల్లూరులో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు, చెన్నైకు డబ్బు తరలిస్తూ పట్టుబడ్డ బంగారం వ్యాపారి బాలు కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంపై... దామచర్లకు సంబంధం ఏమిటని నిలదీశారు. పార్టీ నాయకుడు ఎద్దు శశికాంత్ భూషణ్ మాట్లాడుతూ... ఒంగోలు ప్రజలకు బాలినేని చేసిందేమీ లేదని, ముఖ్యమంత్రి బంధువు అయినా మంత్రి పదవి పోగొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో 25 వేల ఓట్ల తేడాతో ఓడిపోతున్నారని సర్వేలో తేలడంతోనే సానుభూతి కోసం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఒంగోలు ప్రజలు వీటిని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు టిక్కెట్ వస్తుందో, లేదోనన్న అయోమయ స్థితిలో బాలినేని ఉన్నారని... తెదేపా నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు అన్నారు. సమావేశంలో తెలుగు మహిళ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షురాలు రావుల పద్మజ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.కుసుమకుమారి, ఆర్ల వెంకటరత్నం, నాళం నరసమ్మ, ఎం.శ్రీనివాసరావు, నిడమనూరి పావని, పసుపులేటి సునీత తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇట్లుంటది జగన్ తోని.. ఒంగోలు బ్రాండ్కే బ్యాండ్
[ 23-04-2024]
రాజసానికి మారు పేరైన ఒంగోలు గిత్త.. వేల మందికి ఉపాధి చూపిన ఒంగోలు డెయిరీ.. ఈ రెండూ జిల్లాకు ఓ బ్రాండ్లు. ఆ పేర్లు తలుచుకుంటే ప్రకాశం వాసుల మది పులకరిస్తుంది. ఎనలేని సంతోషం, ఉత్సాహం కలుగుతుంది. -
జన బలం జాతర..
[ 23-04-2024]
జన బలానికి.. ప్రలోభాల పర్వానికి ఈ రెండు చిత్రాలే నిలువెత్తు నిదర్శనం. జిల్లావ్యాప్తంగా సోమవారం నామినేషన్ల దాఖలు సందడి నెలకొంది. -
అయిదేళ్లు గుడ్డి గుర్రాల పళ్లు తోమారా!
[ 23-04-2024]
‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పిన జగన్.. అయిదేళ్లలో ఉత్తుత్తి పనులు చేసి చివరిలో శిలాఫలకాలు వేశారు. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండు గేట్లు కొట్టుకుపోయి రెండేళ్లవుతున్నా కనీసం మరమ్మతులు చేయించలేని జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారు’... అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
పడుతూ లేస్తూ పది ఫలితాలు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా గత అయిదేళ్లుగా పడుతూ లేస్తూ వస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 73.74 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ప్రస్తుతం ఆ శాతం 91.21 శాతం ఉత్తీర్ణత సాధించారు. -
89.97 శాతం ఉత్తీర్ణత
[ 23-04-2024]
2023-24 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి ఫలితాల్లో 89.97 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా 60 ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో మొత్తం 887 మంది విద్యార్థులుండగా, అందులో 798 మంది ఉత్తీర్ణులయ్యారు. -
పసివారి పైనా పాలకుడి పడగ
[ 23-04-2024]
పసి వారిపైనా ముఖ్యమంత్రి జగన్ పగబట్టారు. ఆయన నిర్ణయంతో ఈ భావి సంపద నీరుగారిపోతోంది. ‘పది రూపాయలు’ మిగుల్చుకుందామని అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేసే దుస్సాహసానికి ఒడిగట్టారు. -
తాగు.. తూలు.. జైకొట్టు
[ 23-04-2024]
‘బాబ్బాబూ.. నామినేషన్ వేస్తున్నాం. కాస్తంత అక్కడి వరకు వచ్చిపోండి. ఊరకనే కాదు అయిదొందల నోటు, క్వార్టర్ సీసా ఇస్తాం. పసందైన బిర్యానీ కూడా పెట్టిస్తాం. మందు తాగి మా పార్టీ జెండా పట్టుకుని జేజేలు కొడితే చాలు’ ఇదీ ప్రస్తుతం నామినేషన్ల సందర్భంగా వైకాపా అభ్యర్థుల ప్రదర్శనల్లో నాయకుల బతిమలాటలు. -
బాబ్బాబు.. రాజీనామా చేయరూ..!
[ 23-04-2024]
వైకాపా నేతలు తమ సైన్యం అనుకున్న వాలంటీర్లు ఇప్పుడు వారి మాట వినడం లేదు. రాజీనామా చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని దొనకొండ మండల సచివాలయాల కన్వీనర్ గుంటు పోలయ్య తమ గ్రూపులో సోమవారం విజ్ఞప్తి చేశారు. -
నాలుగో రోజు 42 మంది నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
ఒంగోలు పార్లమెంట్తోపాటు, జిల్లా వ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించి నాలుగో రోజైన సోమవారం 42 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. -
చోరీ కేసు నిందితుడి విషాదాంతం
[ 23-04-2024]
చిన్న పొరపాటు నిర్ణయంతో ఓ యువకుడి జీవితం విషాదాంతమైంది. తోటి ఉన్నతోద్యోగులు డబ్బు ఆశ చూపడంతో చోరీ చేసి పట్టుబడి, మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఏరులై పారిన మద్యం
[ 23-04-2024]
మార్కాపురంలో సోమవారం వైకాపా అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు నామినేషన్ సందర్భంగా మద్యం ఏరులైపారింది. డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేశారు.పట్టణంతో పాటు చుటుపక్కల మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులకు రూ.500 నగదు పంపిణీ చేశారు. -
జగనన్న కాలనీలా.. చిట్టడవులా!
[ 23-04-2024]
‘రాష్ట్రంలో ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నా’మంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న జగనన్న కాలనీలు చిన్నపాటి అడవులను తలపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..