బీమా.. భరోసా ఇచ్చేనా!
ప్రమాదవశాత్తూ జరిగే ప్రమాదాల్లో మృతిచెందినవారికి, వైకల్యం పొందిన పేద కుటుంబాలకు భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకం అమలుచేస్తోంది. మార్గదర్శకాల ప్రకారం గతేడాది నమోదు చేసుకున్న వారి వివరాలు ప్రస్తుత
క్షేత్రస్థాయిలో మళ్లీ సర్వే
వైఎస్సార్ బీమా సాయానికి పలువురి ఎదురుచూపులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ప్రమాదవశాత్తూ జరిగే ప్రమాదాల్లో మృతిచెందినవారికి, వైకల్యం పొందిన పేద కుటుంబాలకు భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకం అమలుచేస్తోంది. మార్గదర్శకాల ప్రకారం గతేడాది నమోదు చేసుకున్న వారి వివరాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రమబద్దీకరణ చేయాలి. కొత్తగా బియ్యం కార్డులు పొందిన వారి సమాచారాన్ని యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటా సర్వే చేస్తున్నారు. లబ్ధిదారుల పేర్లు, బ్యాంక్ ఖాతాల్లో తప్పులు ఉన్నా..నామినీ పేర్ల మార్పు చేయడానికి ఈ సారి అనుమతి ఇచ్చారు. అయితే గతంలో ఈ పథకం కింద నమోదైన అనేకమందికి ఇప్పటికీ బీమా డబ్బులు రాక ఆవేదనలో ఉన్నారు.
38 మండలాలకు చెందిన...
గతేడాది జులై ఒకటో తేదీన వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రారంభించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులను గుర్తించారు.పునర్విభజన తర్వాత ఈ ఏడాది ప్రకాశం జిల్లాలోని 38 మండలాలకు చెందిన లబ్ధిదారుల క్రమబద్దీకరణకు ఆదేశాలివ్వడంతో గత నెల రోజులుగా వాలంటీర్లు సర్వే చేపట్టారు. గతయేడాది నమోదు ప్రక్రియ తొలిసారి కావడంతో తప్పులు దొర్లాయి. ప్రస్తుతం మార్పులు, చేర్పులు చేయాలంటే కచ్చితంగా లబ్ధిదారుల ఈకేవైసీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉండే పేద కుటుంబాలకే అర్హత ఉంటుంది. బియ్యం పత్రం తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఉంది. 18-70 సంవత్సరాలలోపు వయస్సు వారికి అవకాశం కల్పిస్తారు. 18-50 ఏళ్లలోపువారు సహజంగా మృతి చెందితే ఆ కుటుంబానికి రూ.లక్ష; రోడ్డు లేదా ఇతరత్రా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతే రూ.5 లక్షలు; శాశ్వత వైకల్యం చెందితే రూ.5 లక్షల చొప్పున బీమా రూపంలో ఆర్థికసాయం ఇస్తుంటారు.
మిగతావారికో
ఈ పథకం కింద జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,155 క్లెయిమ్స్ నమోదయ్యాయి. అందులో 123 ప్రమాద మరణాలు, 1,032 సహజ మరణాలు ఉన్నాయి. ఇప్పటివరకు 1,108 క్లెయిమ్లు మంజూరుకాగా, అందులో 673 క్లెయిమ్లకు సంబంధించి రూ.8.25 కోట్ల నిధులు విడుదల చేశారు. మిగతా బాధిత కుటుంబాలు నెలల తరబడి సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. కొందరు లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల పరిశీలన నిమిత్తం ముందస్తుగా రూపాయి జమ చేసినా ఆ తర్వాత మిగతా మొత్తం జమ కాకపోవడంతో డీఆర్డీఏ, మండల వైఎస్సార్కేపీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సరియైన సమాధానం లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత