అనుమతిలేకుండా నిల్వచేసిన సిలిండర్లు స్వాధీనం
చీమకుర్తి కొత్తపేట బజారులో అనుమతి లేకుండా వివిధ గ్యాస్ కంపెనీలకు చెందిన సిలిండర్లు నిల్వ చేసిన ఇంటిపై స్పెషల్ బ్రాంచి పోలీసులు బుధవారం దాడి చేసి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
సిలిండర్లను పరిశీలిస్తున్న స్పెషల్ బ్రాంచి ఆధికారి సురేష్
చీమకుర్తి, న్యూస్టుడే : చీమకుర్తి కొత్తపేట బజారులో అనుమతి లేకుండా వివిధ గ్యాస్ కంపెనీలకు చెందిన సిలిండర్లు నిల్వ చేసిన ఇంటిపై స్పెషల్ బ్రాంచి పోలీసులు బుధవారం దాడి చేసి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక విభాగం అధికారి సురేష్ తెలిపిన వివరాల మేరకు... కొత్తపేట బజారులో తాళ్లూరి రామకృష్ణ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా హెచ్పీ, ఇండేన్ గ్యాస్ సిలిండర్లను రీ ఫిల్లింగ్ చేసి గ్రానైట్ అనుబంధ పరిశ్రమలు, హోటళ్లకు అమ్మకాలు చేస్తున్నట్లు అందిన సమాచారంతో దాడులు నిర్వహించినట్లు చెప్పారు. ఈ సమయంలో ఓ కంపెనీకి చెందిన సిలిండర్లను సంబంధిత సిబ్బందితో గృహంలో దింపుతుండగా పట్టుకున్నారు. ఇంట్లో తనిఖీలు నిర్వహించగా రెండు కంపెనీలకు చెందిన నిండు సిలిండర్లు 29, చిన్న ఖాళీ సిలిండర్లు 10, పెద్ద ఖాళీ సిలిండర్లు 5లను (మొత్తం 44 సిలిండర్లు) స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్న రామకృష్ణ, హెచ్పీ గ్యాస్ ఆటో నడుపుతున్న వెంగళ మణికంఠను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లో అప్పగించినట్లు సురేష్ చెప్పారు. నివాస గృహాల మధ్య ఈ రీతిలో పెద్ద ఎత్తున సిలిండర్లను నిల్వ చేసి రీఫిల్లింగ్ చేస్తున్న వ్యవహారం బయటకు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. చీమకుర్తి పట్టణంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఇదే రీతిలో కొందరు వ్యక్తులు అక్రమంగా గ్యాస్ సిలిండర్లు నిల్వ చేస్తూ అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆయా విభాగాల అధికారులు ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాక్టర్ జగన్
[ 20-04-2024]
ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు మిలటరీ కాలనీకి చెందిన రమణమ్మ అనే మహిళ ఇటీవల బిడ్డకు జన్మనిచ్చింది. పదో వారంలో వ్యాక్సిన్ వేయించడానికి పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా.. అక్కడి సిబ్బంది స్టాక్ లేదని చెప్పారు. -
కిరాయికి కేటుగాళ్లు
[ 20-04-2024]
ఒకప్పుడు జిల్లాలో విధులు నిర్వహించిన పోలీసు అధికారులు వాళ్లు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసి ఖాళీగా ఉన్నారు. ఇటువంటి వారితో అధికార పార్టీ కొత్త కుట్రలకు తెర లేపింది. -
అడవిలో ఇళ్లిచ్చిన అన్న
[ 20-04-2024]
నవరత్నాలు..పేదలందరికీ ఇళ్లు అంటూ జగన్ ప్రకటనతో మురిసిపోయిన వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ముఖ్యమంత్రి చెప్పిన మర్మం అయిదేళ్ల తర్వాత తెలియడంతో వారంతా ఖిన్నులయ్యారు. -
వేధింపులు.. ఊడిగంలో తగ్గేదే లేదు
[ 20-04-2024]
ఎన్నికల కోడ్కు ముందు మార్కాపురం మున్సిపాలిటీలోని ఆ కీలక పోస్టు ఖాళీ అయ్యింది. -
రాజుకున్న ఎన్నికల వేడి
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతోంది. నామినేషన్ల పర్వం రెండో రోజైన శుక్రవారం.. భారీ ప్రదర్శనలతో జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. -
రగడ.. ఇదేం మర్యాద
[ 20-04-2024]
క్రమశిక్షణకు మారుపేరుగా ప్రభుత్వం చెబుతున్న ట్రిపుల్ఐటీలో పరిస్థితులు అదుపు తప్పాయి. -
వైభవం.. రాములోరి రథోత్సవం
[ 20-04-2024]
శ్రీరామ నవమి నాటి నుంచి మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో నిర్వహిస్తున్న ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. -
ఒట్టు పెడుతున్నాం.. ఓటు వినియోగించుకుంటాం
[ 20-04-2024]
స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై పరిశ్రమల కేంద్రం, ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లోని ఉద్యోగులు, కార్మికులకు శుక్రవారం అవగాహన నిర్వహించారు. -
నగదు చోరీలో ఇంటి దొంగలు
[ 20-04-2024]
ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద సీఎంఎస్ వాహనం నుంచి గురువారం చోరీకి గురైన రూ.66 లక్షల నగదు కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. -
నామినేషన్ల వేళ.. తీరుమారని వైకాపా
[ 20-04-2024]
గిద్దలూరు నగర పంచాయతీలో శుక్రవారం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి నామినేషన్ సందర్భంగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేపట్టడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
‘సొంత చెల్లినే గెంటేసిన వ్యక్తి జగన్’
[ 20-04-2024]
కష్టకాలంలో తనను ఆదుకున్న సొంత చెల్లినే బయటకు గెంటేసిన వ్యక్తి సీఎం జగన్ అని తెదేపా జోన్-4 పరిశీలకుడు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి వివరించారు. -
నామపత్ర సంబరం
[ 20-04-2024]
నామపత్రాల సమర్పణకు శుక్రవారం సుమూహూర్తం కావడంతో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. -
కోలాహలంగా ఎరిక్షన్బాబు నామినేషన్
[ 20-04-2024]
యర్రగొండపాలెం తెదేపా ఉమ్మడి అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు శుక్రవారం నామినేషన్ వేశారు. -
వీధిన పడ్డ బతుకులు
[ 20-04-2024]
ఈ అయిదేళ్ల వైకాపా పరిపాలనలో పేద, మధ్య తరగతుల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. -
తెదేపాలో చేరికల ఉత్సాహం
[ 20-04-2024]
దర్శి తెదేపాలో చేరికల జోరు కొనసాగుతోంది. పలువురు నాయకులు, కార్యకర్తలు అధికార వైకాపాను వీడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు