కారు ఢీకొని... విద్యార్థినికి తీవ్ర గాయాలు
కళాశాల నుంచి రోడ్డు దాటుతున్న విద్యార్థినిని కారు ఢీ కొనడంతో తీవ్ర గాయపడ్డ సంఘటన టంగుటూరు మండలం వల్లూరు రైస్ కళాశాల ఎదుట బుధవారం చోటు చేసుకుంది
గాయపడిన హరితకు సపర్యలు చేస్తున్న విద్యార్థులు, స్థానికులు
టంగుటూరు, న్యూస్టుడే: కళాశాల నుంచి రోడ్డు దాటుతున్న విద్యార్థినిని కారు ఢీ కొనడంతో తీవ్ర గాయపడ్డ సంఘటన టంగుటూరు మండలం వల్లూరు రైస్ కళాశాల ఎదుట బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, విద్యార్థులు తెలిపిన వివరాల మేరకు ...కొండపి మండలం దేవిరెడ్డిపాలెం (రెడ్డిపాలెం)కు చెందిన భోగిరెడ్డి హరిత వల్లూరు సమీపంలోని రైస్ కళాశాలలో ఎంబీఏ చదువుతోంది.. కళాశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు స్నేహితులతో కలసి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బయటకు వచ్చింది. 16వ జాతీయ రహదారిలో స్నేహితులతో మాట్లాడి వెనక్కి వస్తుండగా విజయవాడ నుంచి టంగుటూరు వైపు వెళ్తున్న కారు అతి వేగంగా వచ్చి హరితను ఢీకొంది. కారు వేగానికి హరిత కారు ముందు భాగంలోని అద్దానికి ఢీకొని గాలిలో ఎగిరి రోడ్డుపై పడింది. తలకు గాయం కావడంతో స్పృహ కోల్పోయింది. తోటి విద్యార్థులు హరితకు సపర్యలు చేయడంతో కోలుకుంది. 108కి సమాచారం అందించినా ఎంత సేపటికీ రాలేదు. హరితను ఢీ కొన్న కారు నిలపకుండా వేగంగా వెళ్లిపోవడంతో కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు వెంబడించి వల్లూరు గ్రామ సమీపంలో అడ్డగించారు. కారు నడుపుతున్న వ్యక్తి ఆటోలో ఒంగోలు పోలీస్ స్టేషన్కి అంటూ వెళ్లి పోయాడని సమాచారం. దీనిపై హైవే పోలీసులు టంగుటూరు పోలీసులకు సమాచారం అందించారు.
మానవత్వం చాటుకున్న ఎంపీపీ : ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఒంగోలు నుంచి టంగుటూరుకు కారులో వెళ్తున్న టంగుటూరు ఎంపీపీ పటాపంజుల కోటేశ్వరమ్మ, ఆమె అల్లుడు మస్తాన్బాబులు సంఘటన చూసి మానవత్వంతో వారి కారులో హరితను ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించారు. హరిత వివరాలను స్నేహితుల ద్వారా తెలుసుకుని టంగుటూరు మండలంలోని పలు వాట్సాప్ గ్రూప్ల్లో పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న పలువురు హరిత తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి