Road Accident: ప్రకాశం జిల్లాలో ప్రైవేట్‌ బస్సు-లారీ ఢీ: ఒకరు మృతి, 20 మందికి గాయాలు

బేస్తవారిపేట మండలం పూసలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్‌ బస్సు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 

Updated : 30 Jun 2022 06:05 IST

ప్రకాశం: బేస్తవారిపేట మండలం పూసలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్‌ బస్సు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయచర్యలు చేపట్టారు. బాధితులను కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీని ఢీనొకి బస్సు అడ్డంగా పడడంతో జాతీయ రహదారిపై ఇరువైపుల కిలోమీటర్‌ మేర వాహనాలు నిలిచిపోయాయి. క్రేన్‌ సహాయంలో అధికారులు బస్సును తొలగిస్తున్నారు. బస్సు విజయవాడ నుంచి అనంతపురం వెళ్తుండగా ఘటన జరిగింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని