అంతా అడ్డగోలు
ఒంగోలు ఉప రవాణా కమిషనర్ కార్యాలయం(డీటీసీ)లో ప్రైవేటు వ్యక్తుల హవా నడుస్తోంది. సాధారణంగా వాహనాల పత్రాలు, సామర్థ్యాన్ని (ఫిట్నెస్) మోటారు వాహనాల
ప్రైవేటు కనుసన్నల్లో బస్సుల తనిఖీలు
రవాణా శాఖ కార్యాలయంలో పరిస్థితి
ఒంగోలు డీటీసీలో పత్రాల పరిశీలిస్తున్న ప్రైవేటు వ్యక్తి.. అదే వ్యక్తి బడి బస్సును తనిఖీ చేస్తూ...
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: ఒంగోలు ఉప రవాణా కమిషనర్ కార్యాలయం(డీటీసీ)లో ప్రైవేటు వ్యక్తుల హవా నడుస్తోంది. సాధారణంగా వాహనాల పత్రాలు, సామర్థ్యాన్ని (ఫిట్నెస్) మోటారు వాహనాల ఇన్స్పెక్టర్(ఎంవీఐ) పరిశీలించాలి. కార్యాలయంలోని కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఆయనకు సహకరిస్తుంటారు. అందుకు భిన్నంగా ఇక్కడ ‘ప్రైవేటు’ వ్యవహారం నడుస్తోంది. జులై 5వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానుండగా పెద్దసంఖ్యలో బడి బస్సులకు సామర్థ్య ధ్రువపత్రాలు(ఎఫ్సీ)లు జారీ కాలేదు. దీనిపై జూన్ 29న ‘బడి బస్సు.. తనిఖీలకు ముఖం చాటేస్తూ..’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. రవాణాశాఖ అధికారులు స్పందించారు. తక్షణం బస్సులకు ఎఫ్సీలు తీసుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తామని యాజమాన్యాలను హెచ్చరించారు. దీంతో రవాణా శాఖ కార్యాలయాల వద్ద నిత్యం బస్సులు బారులు తీరుతున్నాయి.
ఏం జరుగుతుందంటే..
బడి బస్సుల తనిఖీల విషయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. నేరుగా ఎంవీఐ వాహనాన్ని పరిశీలించాలి. స్వయంగా నడిపి చూసి సంతృప్తి చెందిన తర్వాతనే ఎఫ్సీ మంజూరు చేయాలి. ఒంగోలు డీటీసీలో గురువారం దానికి భిన్నమైన పరిస్థితి.. బీమా పత్రాల పరిశీలనలో ఎంవీఐ నిమగ్నమై ఉంటే ప్రైవేటు వ్యక్తులు బస్సులను తనిఖీ చేస్తున్నారు. అంతా తూతూమంత్రమే. ఈ తరహా తనిఖీలు అక్రమాలకు ఆస్కారం కల్పిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్యాబ్ల ద్వారా వాహనం ఫొటోలు తీసి, వాటి వివరాలతో సహా ఎంవీఐలు అప్లోడ్ చేయాలి. ఆ బాధ్యతలను కానిస్టేబుల్/హోంగార్డులు చూస్తున్నారు. ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM