యంత్రాలిలా.. స్వచ్ఛ జలమెలా!
జిల్లాలోని 38 మండలాల్లో 1791 ప్రాథమిక పాఠశాలలు.. 210 ప్రాథమికోన్నత పాఠశాలలు.. 277 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో రక్షిత మంచినీటి కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రధానోపాధ్యాయులు,
పాఠశాలల్లో విలువైన యంత్రాలు మూలకు
మార్కాపురం, న్యూస్టుడే
జిల్లాలోని 38 మండలాల్లో 1791 ప్రాథమిక పాఠశాలలు.. 210 ప్రాథమికోన్నత పాఠశాలలు.. 277 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో రక్షిత మంచినీటి కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి గ్రామస్థులు, దాతలను ప్రోత్సహించి సొంతంగా వారి చేత ఏర్పాటుచేయించారు.. వాటిల్లో కొన్ని నిర్వహణ లేక మూలకు చేరాయి. మొదటి విడత నాడు-నేడులో జిల్లాలోని 1034 పాఠశాలల్లో పనులు చేపట్టారు. అందులో భాగంగా విద్యార్థులకు శుద్ధిచేసిన నీటిని అందించేందుకు ఆర్వో ప్లాంట్లను ఏర్పాటుచేశారు. విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.75 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు ఒక్కో ప్లాంట్కు ఖర్చయింది. తద్వారా ఫ్లోరైడ్ సమస్య లేకుండా చూడవచ్చని భావించారు. మధ్యాహ్న భోజన సమయంలో వంటకు కూడా ఈ నీళ్లు ఉపయోగపడేవి. అనేకచోట్ల ఏర్పాటుచేసిన ఆరునెలలకే ఆ యంత్రాలు పాడై మూలకు చేరాయి. దీంతో పరిస్థితి మొదటికి వచ్చింది. కొందరు ఇళ్ల నుంచి తెచ్చుకుంటుండగా మరికొన్నిచోట్ల స్థానికంగా లభించే నీటిని మధ్యాహ్న భోజన సమయంలో ఉపయోగించుకుంటున్నారు. వంటకు కూడా అవే వాడాల్సి వస్తుంది. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు దాతలను ప్రోత్సహించి స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆర్వో ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసి తెచ్చి విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నారు. తక్షణం జిల్లా యంత్రాంగం స్పందించి ఎక్కడెక్కడ సమస్య నెలకొందో అక్కడ మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ వీటిని బాగు చేయించడానికి ప్రభుత్వం ఏపీడబ్ల్యూయూఐడీసీ సంస్థకు అప్పగించిందని.. విడతల వారీగా చర్యలు తీసుకుంటారని తెలిపారు.
మార్కాపురం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలకు ప్రభుత్వం నాడు-నేడు కింద రూ.2.50 లక్షలు వెచ్చించి శుద్ధి జలకేంద్రం(ఆర్వో ప్లాంట్) ఏర్పాటుచేసింది. సుమారు 1050 మంది విద్యార్థులకు ఈ జలం ఎంతో ఉపయుక్తంగా ఉండేది. ప్రస్తుతం యంత్రాలు మరమ్మతులకు గురికావడంతో పిల్లలంతా ఇళ్ల నుంచి నీళ్ల సీసాలు తెచ్చుకోవాల్సి వస్తుంది. మరికొంతమంది స్థానికంగా బోరు నీటిని వినియోగిస్తున్నారు.
కొనకనమిట్ల మండలంలోని తువ్వపాడు ప్రాథమిక పాఠశాలలోనూ ఇదే పరిస్థితి. పాఠశాలల నిర్వహణకే నిధులు లేని పరిస్థితుల్లో యంత్రం ఎలా బాగుచేయించాలో తెలియడంలేదు. దీంతో 40 మంది విద్యార్థులకు తాగునీటి సమస్య ఏర్పడింది. ఇదే మండలంలోని కె.నాగంపల్లి బడిలో ప్లాంట్ పనిచేయకపోవడంతో అగచాట్లు తప్పడంలేదు. స్థానికంగా ఉన్న బోరు నీటిలో ఫ్లోరైడ్ ఉండటంతో ఇళ్ల నుంచి సీసాలతో నీటిని తెచ్చుకుని భోజనాలు చేస్తున్నారు.
తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం ప్రాథమిక పాఠశాలలో యంత్రం ఇది. ప్రస్తుతం పనిచేయడంలేదు.
మార్కాపురం మండలంలోని వేములకోట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుద్ధి జల యంత్రాలు గతయేడాది కొన్ని నెలలవరకు బాగానే పనిచేశాయి. ప్రస్తుతం అవి మొరాయించాయి. మోటారు పూర్తిగా చెడిపోయింది. బాగుచేస్తేనే ఇక్కడ తాగునీటి సమస్య తీరుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...