పాఠశాలల విలీనంతో ప్రయోజనాలు
ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, వాటిని గ్రహించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ విద్యార్థుల తల్లిదండ్రులకు
ప్రమాదాలకు తావు లేకుండా ఏర్పాట్లు చేస్తాం: కలెక్టర్
కలెక్టర్ దినేష్కుమార్కు సమస్యలు విన్నవిస్తున్న విద్యార్థుల తల్లులు
తాళ్లూరు, న్యూస్టుడే: ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, వాటిని గ్రహించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. శుక్రవారం తాళ్లూరు వచ్చిన సందర్భంగా కొందరు మహిళలు ఆయన్ను కలిసి విలీనం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు విన్నవించారు. కిలోమీటరు దూరంలోని పాఠశాలలకు పంపలేకపోతున్నామని, ప్రధాన రహదారుల పైనుంచి వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో పలువురు అధికారులతో పాఠశాలల విలీనంపై చర్చించారు. ప్రైవేటు పాఠశాలల మాదిరి ఆటోలు వంటి రవాణా వాహనాలు ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించాలని ఎంఈవో సుబ్బయ్యకు సూచించారు. ప్రధాన రహదారుల పక్కన పాదచారులు నడిచి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తే పిల్లలకు ప్రమాదాలు జరగవని కొందరు తెలిపారు. వాహనాలు వేగంగా వెళ్లకుండా వేగ నిరోధకాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ ప్రత్యేకాధికారిణి పి.గ్లోరియా, మండల ప్రత్యేకాధికారి ఉపేంద్రకుమార్, తహసీల్దారు రామ్మోహరావు, డీటీ రవి, ఎంపీడీవో వి.శ్రీనివాసరావు, ఎంఈవో సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు