చనిపోయామన్నారు.. ఆ పత్రాలివ్వరూ!
‘మేమంతా బతికుండగానే చనిపోయినట్లు ఆన్లైన్లో నమోదు చేశారు. మాకు మరణ ధ్రువీకరణ పత్రాలైనా ఇవ్వండి.. పింఛన్లయినా మంజూరు చేయండి’ అంటూ పామూరు మండలం
పింఛను దరఖాస్తుదారుల ఆందోళన
అధికారులపై పోలీసులకు ఫిర్యాదు
అధికారులపై చర్యలు తీసుకోవాలని
ఎస్సై సురేష్కు ఫిర్యాదు చేస్తున్న బాధితులు.. చిత్రంలో తెదేపా నాయకులు
పామూరు, న్యూస్టుడే: ‘మేమంతా బతికుండగానే చనిపోయినట్లు ఆన్లైన్లో నమోదు చేశారు. మాకు మరణ ధ్రువీకరణ పత్రాలైనా ఇవ్వండి.. పింఛన్లయినా మంజూరు చేయండి’ అంటూ పామూరు మండలం నర్రమారెళ్ల, చింతలపాలెం, సుబ్బక్కపల్లి, బొట్లగూడూరు తదితర గ్రామాలకు చెందిన పింఛను దరఖాస్తుదారులు డిమాండ్ చేశారు. శనివారం తెదేపా నాయకులతో కలిసి స్థానిక శేషమహల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు పత్రాలు పట్టుకొని ప్రదర్శనగా వెళ్లారు. బాధ్యులైన అధికారులపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలంటూ ఎస్సై కె.సురేష్కు ఫిర్యాదుచేశారు. మండల పరిషత్తు కార్యాలయానికి చేరుకుని రహదారిపై బైటాయించి ఆందోళన చేపట్టారు. సామాజిక భద్రత పింఛన్లు పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నాయని.. అవి మంజూరై నంబర్లు కూడా వచ్చాయన్నారు. తెదేపా సానుభూతిపరులమైన తమకి నగదు రాకుండా చేసేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నించారన్నారు. తాము చనిపోయినట్లు అధికారుల ద్వారా ఆన్లైన్లో తప్పులు నమోదుచేసి పైలోకానికి పంపారన్నారు. కూలి పనులు, డప్పులు కొట్టుకుని జీవిస్తున్నామని..ఇలా అన్యాయం చేయడం తగదని మరికొందరు పేద ఎస్సీ దరఖాస్తుదారులు వాపోయారు. అధికారులు లేకపోవడంతో కార్యాలయ గది గోడకు ఫిర్యాదును అతికించారు. మాజీ జడ్పీటీసీ సభ్యులు బొల్లా మాల్యాద్రి చౌదరి, ఎం.హుస్సేన్రావు మాట్లాడుతూ మండలంలో 36 మంది దరఖాస్తుదారులు మృతిచెందినట్లు నమోదు చేయడం దారుణమన్నారు. ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. మండల ఎస్సీ సెల్, తెలుగురైతు అధ్యక్షులు డోలా శేషాద్రి, మన్నం రమణయ్య, నాయకులు పి.రామారావు, జి.శ్రీను, యు.హరిబాబు, పి.వెంకటేశ్వర్లు, కె.సుభాషిణి, ఎస్.మోషే, ఎం.రామకృష్ణ, కె.రాము తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు