మృత్యుపాశానికి చిక్కిన బంధం
వారంతా ఎంతో ఉత్సాహంగా తిరుమలకు బయలుదేరారు. మనవడు కారు నడుపుతుండగా తాతయ్యతో పాటు అమ్మమ్మ, ఆమె చెల్లెల్లిద్దరూ వెనుక కూర్చొన్నారు. ఇంతలోనే ప్రమాద రూపంలో విధి వెంటాడింది. ఆ అయిదుగురూ అక్కడికక్కడే దుర్మరణం చెందడంతో బంధువులంతా తల్లడిల్లారు. ఆసుపత్రికి చేరుకొని తీవ్రంగా విలపించారు. కంభం పట్టణంలోని డెయిరీకి కూతవేటు దూరంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
ప్రమాదంలో అయిదుగురి దుర్మరణంతో విషాదం
ఒకేసారి ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు
కంభం, న్యూస్టుడే
కంభం వైద్యశాల వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న నాగిరెడ్డి తల్లి, బంధువులు
వారంతా ఎంతో ఉత్సాహంగా తిరుమలకు బయలుదేరారు. మనవడు కారు నడుపుతుండగా తాతయ్యతో పాటు అమ్మమ్మ, ఆమె చెల్లెల్లిద్దరూ వెనుక కూర్చొన్నారు. ఇంతలోనే ప్రమాద రూపంలో విధి వెంటాడింది. ఆ అయిదుగురూ అక్కడికక్కడే దుర్మరణం చెందడంతో బంధువులంతా తల్లడిల్లారు. ఆసుపత్రికి చేరుకొని తీవ్రంగా విలపించారు. కంభం పట్టణంలోని డెయిరీకి కూతవేటు దూరంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు కంభం వద్ద ముందు వెళ్తున్న సిమెంటు లారీని ఢీకొట్టింది. కన్నుమూసి తెరిచేలోగా కారులో ఉన్న జూలకంటి నాగిరెడ్డి (23), చిలకల పెద్ద హనిమిరెడ్డి (70), చిలకల ఆదిలక్ష్మి (60), భూమిరెడ్డి గురవమ్మ (55), పల్లె అనంతరాములు (50) ప్రాణాలు విడిచారు. సమాచారం అందినవెంటనే కంభం సీఐ రాజేష్కుమార్, ఎస్సై నాగమల్లేశ్వరరావు, సిబ్బంది చేరుకొన్నారు. కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయి మృతదేహాలు దాంట్లోనే ఇరుక్కుపోయాయి. ట్రాక్టర్ సహాయంతో కారు భాగాలను తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. పలు ప్రైవేటు వాహనాల్లో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అదే గ్రామం నుంచి మరో వాహనంలో తిరుమలకు వెళ్తున్న వీరి బంధువులు తొమ్మిదిమంది అప్పటికే చాలా దూరం ముందుకు వెళ్లిపోయారు. అందులో నాగిరెడ్డి తల్లిదండ్రులు హనిమిరెడ్డి, గురవమ్మతో పాటు అన్న శ్రీనివాసరెడ్డి ఉన్నారు. పోలీసులు అందించిన సమాచారం తెలుసుకొని వెనక్కి వచ్చారు. జరిగిన ఘోరాన్ని చూసి విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను పోలీసులు అప్పగించారు. మృతి చెందిన పెద్దహనిమిరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు కాగా నాగిరెడ్డి వీరి మనవడు. గురవమ్మ, అనంతరాములు ఆదిలక్ష్మి తోడబుట్టినవారు. అంతా వ్యవసాయ కుటుంబాలకు చెందినవారే.
లారీని ఢీ కొని నుజ్జునుజ్జు అయిన కారు
ఎన్నో కలలతో వెళ్లి..
జూలకంటి నాగిరెడ్డి గుంటూరులో బీటెక్ చదివారు. పదినెలల క్రితమే ఎంఎస్ చేసేందుకు లండన్ వెళ్లిన ఆయన ఇటీవలే స్వగ్రామానికి వచ్చారు. తిరుమల వెళ్లడం కోసమని బంధువుల కారును తీసుకొన్నారు. తానే స్వయంగా నడుపుతున్నాడు. కొద్దిరోజుల్లో తిరిగి లండన్ వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇతని సొంతూరు వెల్దుర్తి కాగా పదేళ్ల క్రితం తల్లిదండ్రులు హనిమిరెడ్డి, గురవమ్మ కుటుంబంతో సహా శిరిగిరిపాడు వచ్చారు. ఇక్కడే కొంత పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. నాగిరెడ్డి విదేశాల్లో చదివి మంచి ఉద్యోగం చేస్తాడనే ఉద్దేశంతో సుమారు రూ. 18 లక్షల మేర అప్పు చేసి పంపించారు. వారి కల నెరవేరనే లేదు. తండ్రి హనిమిరెడ్డి కొంతకాలం క్రితం కిందపడడంతో కాలువిరిగింది. అన్న శ్రీనివాసరెడ్డి డిగ్రీ చదివాడు.
తోబుట్టువులంతా ఒకే వాహనంలో వెళ్లాలని..
ప్రమాదంలో మృతి చెందిన భూమిరెడ్డి గురవమ్మకు కుమారులు లింగారెడ్డి, నాగిరెడ్డి, కుమార్తె నాగమణి సంతానం. వీరందరికీ వివాహాలయ్యాయి. తన తల్లితో పాటు ఆమె అక్క, చెల్లి ఒకే కారులో ప్రయాణిస్తే బాగుంటుందన్న వెళ్లారని.. ముగ్గురూ చనిపోయారని కుమారుడు విలపించారు. తిరుపతి నుంచి తిరుమలకు మెట్లు ఎక్కలేననే ఉద్దేశంతో తన తల్లి తొలుత ప్రయాణం మానుకోవాలనుకున్నారని.. కారులోనే వెళ్దామని చెప్పడంతో ఆమె బయలుదేరారన్నారు.
తిరిగి వచ్చి వైద్యం చేయించుకుందామని..
అనంతరాములు స్వస్థలం పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేవిడిచర్ల. ఆమెకు భర్త పున్నారెడ్డి, కుమార్తె అరుణ ఉన్నారు. కంటికి శుక్లాలు రావడంతో నరసరావుపేటలో ఆమె వైద్యం చేయించుకోవాలనుకున్నారు. తిరుమలకు వెళ్లి వచ్చిన తర్వాత చేసుకోవచ్చని వాయిదా వేశారని.. ఇంతలోనే ఆమె మృత్యువుకు చిక్కారని కుటుంబ సభ్యులు తెలిపారు.
తండ్రి సేద్యానికి వెళ్లలేడని..
మృతిచెందిన పెద్దహనిమిరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు అంజిరెడ్డి ఉన్నారు. మూడెకరాల పొలం సాగు చేసుకుంటున్నారు. వీరి పెద్ద కుమార్తె గురవమ్మ కుమారుడే నాగిరెడ్డి. తొలుత అంజిరెడ్డి తిరుమల వెళ్లాలనుకున్నారు. సేద్యం పనులు ఉన్నందున పెద్దహనిమిరెడ్డిని పంపించినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాలంటీర్ల మెడపై వైకాపా కత్తి
[ 24-04-2024]
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో వైకాపా నేతలు, ఆ పార్టీ అధినేతను మించిన వారుండరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. -
అన‘కొండలు’ తిన్న మన్ను.. రూ.860 కోట్లు
[ 24-04-2024]
తవ్వుకు‘న్నోళ్ల’కు తవ్వుకున్నంత.. మేసి‘నోళ్ల’కు మేసినంత. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో సహజ వనరుల విధ్వంసం యథేచ్ఛగా సాగింది. నేతల ముసుగులో ఉన్న గుంట నక్కలు బరితెగించాయి. -
ఇది కాదా.. జగన్నాటకం!
[ 24-04-2024]
అబద్ధపు హామీలు గుప్పించడం.. మాయమాటలు చెప్పడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని మించినవారుండరు. అయిదేళ్లు పట్టించుకోకుండా ఉండటం. -
నామినేషన్ల వేళ మారిన పేర్లు
[ 24-04-2024]
నామినేషన్ల దాఖలు సమయంలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చోటుచేసుకుంది. గతంలో ప్రకటించిన వారికి కాకుండా కొన్నిచోట్ల ఇతరులకు సీట్లు కేటాయించారు. -
అరవీర ‘రంగు’ మార్తాండ
[ 24-04-2024]
మురుగు కాలువలు లేవు. ఉన్న వాటినైనా శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లే దిక్కు. పగిలిపోతే మరమ్మతులకు పైసల్లేవు. -
క్యాషియర్ జగన్.. నొక్కవేం బటన్
[ 24-04-2024]
రాష్ట్రంలో సంక్షేమం కోసం తరచూ బటన్లు నొక్కుతున్నాను. ప్రతి గడపకూ సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేరుస్తున్నానంటూ గొప్పలు చెప్పే ముఖ్యమంత్రివన్నీ ఉత్తుతి మాటలేనని అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సర్పంచులపై గురి.. పల్లెలకు ఉరి
[ 24-04-2024]
పల్లెవాసుల ఆశల్ని చిదిమేశారు..పట్టుగొమ్మలనూ నరికేశారు..నిధుల్ని దిగమింగేశారు..చిల్లిగవ్వ కోసం దేబిరించాల్సిన దుస్థితిలోకి పంచాయతీల్ని నెట్టేశారు. -
అయిదో రోజు 46 నామపత్రాల దాఖలు
[ 24-04-2024]
ఒంగోలు పార్లమెంట్తోపాటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అయిదో రోజైన మంగళవారం 46 మంది తమ నామపత్రాలు దాఖలు చేశారు. -
తెదేపాలో చేరికల జోరు
[ 24-04-2024]
తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. మంగళవారం వైకాపా సర్పంచి కోమలి భర్త బొల్లినేని మధు అనుచర గణంతో సహా పార్టీలో చేరారు. -
కరోనాతో ఆర్థికంగా కుదేలై.. మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య
[ 24-04-2024]
కరోనాతో ఆర్థికంగా కుదేలైన ఓ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం సింగరాయకొండలో చోటు చేసుకుంది. -
చిట్టితల్లి వేడుక చూడకుండానే..
[ 24-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి పుష్పాలంకరణ వేడుక చూడకుండానే ఆ తండ్రి దూర తీరాలకు చేరుకున్నారు. సామగ్రి తీసుకొస్తుండగా, కారు చక్రాలు కర్కశంగా ఆయన్ను చిదిమేశాయి. -
ఉత్సవ విగ్రహాల్లా మార్చేశావ్.. జగన్
[ 24-04-2024]
గత ప్రభుత్వ హాయంలో సర్పంచులు అంటే ఎంతో గౌరవంగా ఉండేది. చెక్ పవర్తో నిధులను ఖర్చు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేవారు. -
రోడ్లు ఛిద్రం.. ఒళ్లు హూనం
[ 24-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. ఎక్కడా ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఈ దారుల్లో ప్రయాణిస్తే ఒళ్లు హూనమవుతుందో రామచంద్రా అని ప్రజలు బాధ వెలబోసుకున్న వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. -
‘భూ’చోళ్ల అవినీతి రూ.201.33 కోట్లు
[ 24-04-2024]
ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూముల కొనుగోలులో భారీ ఎత్తున కుంభకోణం చోటుచేసుకుందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని భూ పరిపాలన శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.