ధీశాలి.. టంగుటూరి
బ్రిటిష్ పాలనలో ఉన్న భారతీయుల బానిస సంకెళ్లను తెంచడానికి స్వాతంత్య్ర సమరంలో చురుకైన పాత్రను పోషించిన మహనీయుడు ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు. జిల్లాలో ఆయన అడుగుజాడలెన్నో. ప్రస్తుతం దేశమంతా ఆజాదీ కా అమృత మహోత్సవం నిర్వహిస్తున్న వేళ ఆ ధీశాలి గురించి ఒక్కసారి అవలోకిస్తే..
బ్రిటిష్ పాలనలో ఉన్న భారతీయుల బానిస సంకెళ్లను తెంచడానికి స్వాతంత్య్ర సమరంలో చురుకైన పాత్రను పోషించిన మహనీయుడు ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు. జిల్లాలో ఆయన అడుగుజాడలెన్నో. ప్రస్తుతం దేశమంతా ఆజాదీ కా అమృత మహోత్సవం నిర్వహిస్తున్న వేళ ఆ ధీశాలి గురించి ఒక్కసారి అవలోకిస్తే..
నాగులుప్పలపాడు, న్యూస్టుడే: నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెం టంగుటూరి స్వస్థలం. వెంకటనరసింహులు, సుబ్బమ్మ దంపతులకు 1872 ఆగస్టు 23న ఆయన జన్మించారు. ఆరుగురు సంతానంలో ఒకరు. ఆయన పదకొండో ఏట తండ్రి మరణించడంతో కుటుంబం ఒంగోలుకు చేరింది. అక్కడ భోజనశాలను కొంతకాలం నడిపారు. తల్లి సంసాదన సరిపోక ధనికుల ఇళ్లలో ప్రకాశం వారాలు చేసి ఒంగోలు సమీపంలోని వళ్లూరులో ప్రాథమిక విద్య అభ్యసించారు. మిషన్ పాఠశాల ఉపాధ్యాయుడైన ఇమ్మానేని హనుమంతరావు నాయుడు చొరవతో ఉచితంగా మెట్రిక్ చదివారు.. అనంతరం రాజమండ్రిలో ఎఫ్ఏ, మద్రాసులో న్యాయశాస్త్రం చదివారు. కొంతకాలం ఒంగోలు, రాజమండ్రిలో న్యాయవృత్తి చేసి పేరు సాధించారు. రాజమండ్రిలో ఆయన పురపాలక సంఘం అధ్యక్షులుగా కూడా పనిచేశారు. మద్రాస్ హైకోర్టులో వాదించడానికి అవకాశం లేకపోవడంతో 1904లో ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ను పూర్తి చేసి 1907లో భారత్కు వచ్చి న్యాయవాద వృత్తి కొనసాగించారు.
ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం పంతులు
తుపాకీకి ఎదురొడ్డి..
తెలుగు, తమిళం, ఆంగ్ల భాషలలో స్వరాజ్య పత్రికకు సంపాదకత్వ బాధ్యతలను టంగుటూరి నిర్వహించారు. 1921 అక్టోబర్లో సత్యాగ్రహ ప్రతినపై సంతకం చేశారు. న్యాయవాది వృత్తిని వదిలి స్వాతంత్య్ర పోరాటంలోకి అడుగు పెట్టారు. తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేశారు. యావదాస్తిని ప్రజలకు రాసిచ్చారు. స్వరాజ్య పోరాటంలో 1928లో సైమన్ కమిషన్కు ఎదురుతిరిగారు. తెల్లవారి తుపాకీకి తన గుండెను ఎదురొడ్డిన ధైర్యశాలి. గాంధీజీ పిలుపు మేరకు ఒంగోలు మండలం దేవరంపాడు శివారు గుండ్లకమ్మ నది ఒడ్డున ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టారు. ఇక్కడ 1935 నవంబరు 21న అప్పటి ఏఐసీసీ అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్ విజయ స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాంధీజీ నుంచి ప్రకాశం పంతులుకు వచ్చిన అభినందన లేఖ ఇప్పటికీ దేవరంపాడు గ్రంథాలయంలో ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగానూ 1953 అక్టోబరులో ఎన్నికయ్యారు. 13 నెలల తర్వాత 1954లో రాజీనామా చేశారు. 1957 మే 20న ఆయన చనిపోయారు. దేవరంపాడులో వసతి ఏర్పాటు చేసుకొని తన చివరి మజిలీ ఎక్కువగా విజయ స్థూపం వద్దనే ప్రకాశం పంతులు గడిపారని చెబుతారు. జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్ 5న అప్పటి వరకూ ఉన్న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా పేరు మార్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని పండుగగా నిర్వహిస్తోంది. 150వ జయంతి వేడుకలను వినోదరాయునిపాలెంలో ఈ నెల 23న ఘనంగా నిర్వహించనున్నారు.
తన కుమారులు నరసింహం, హనుమంతరావు, మనవడితో నాటి చిత్రం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్