హత్య కేసులో నిందితుడి అరెస్టు
కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో పగడాల హరికృష్ణారెడ్డి హత్యకేసులో ముద్దాయి కొప్పుల నరేంద్రరెడ్డి అలియాస్ నానిని అరెస్టు చేసినట్లు పొదిలి సీఐ యు.సుధాకరరావు తెలిపారు. సోమవారం పొదిలిలో హత్యకేసు వివరాలను ఆయన
పొదిలి, న్యూస్టుడే: కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో పగడాల హరికృష్ణారెడ్డి హత్యకేసులో ముద్దాయి కొప్పుల నరేంద్రరెడ్డి అలియాస్ నానిని అరెస్టు చేసినట్లు పొదిలి సీఐ యు.సుధాకరరావు తెలిపారు. సోమవారం పొదిలిలో హత్యకేసు వివరాలను ఆయన వెల్లడించారు. కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో ఏప్రిల్ 15వ తేదీ రాత్రి ఆటో మొబైల్ సర్వీస్ దుకాణంలో పగడాల హరికృష్ణారెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ హత్యపై హరికృష్ణారెడ్డి కుమారుడు పగడాల వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. హనుమంతునిపాడు మండలం దొడ్డిచింతల గ్రామానికి చెందిన హరికృష్ణారెడ్డి గొట్లగట్టు ఆటో మొబైల్ అండ్ సర్వీస్ సెంటర్ దుకాణాన్ని నడుపుతున్నాడు. తన మేనమామ కొడుకైన కొప్పుల నరేంద్రరెడ్డిని తన వద్దనే ఉంచుకుని పని నేర్పిస్తున్నాడు. ఇంటి నిర్మాణపనులు చేసుకుంటూ హరికృష్ణారెడ్డి కొన్ని రోజులు దుకాణానికి రాలేదు. దుకాణ లావాదేవీలన్నీ నరేంద్రరెడ్డి చూసుకుంటున్నాడు. 15వ తేదీ హరికృష్ణారెడ్డి దుకాణానికి వచ్చి డబ్బుల లెక్కలు చూడగా పది వేల రూపాయలు తేడా వచ్చింది. డబ్బుల విషయం నరేంద్రరెడ్డిని అడిగి నలుగురి ముందు తిట్టారు. ఈ విషయాన్ని నరేంద్రరెడ్డి మనస్సులో పెట్టుకుని అదే రోజు రాత్రి దుకాణంలో నిద్రపోతున్న హరికృష్ణారెడ్డిని కత్తితో గొంతు కోసి మోటారు సైకిల్పై పారిపోయాడు. నిందితుడు ఆదివారం గొట్లగట్టు వీఆర్వో వద్ద లొంగిపోయినట్లు సీఐ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి పొదిలి కోర్టుకు హాజరుపరిచినట్లు ఆయన తెలిపాడు.
బాలిక తండ్రిపై కేసు నమోదు
కొమరోలు గ్రామీణం, న్యూస్టుడే: బాల్య వివాహాన్ని జరిపించిన తండ్రిపై బాల్య వివాహ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాంబశివయ్య తెలిపారు. కొమరోలు మండలం యర్రగుంట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను తన మేనల్లుడికి ఇచ్చి ఈ నెల 7న వివాహం జరిపించారు. ఆ మేరకు సమాచారం అందుకున్న రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులు విచారణ నిర్వహించారు. బాల్య వివాహం చేసుకున్న వ్యక్తి, వివాహంలో పాల్గొన్న వారిపై కూడా ఈ చట్టం ద్వారా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM