పలు దేవాలయాల్లో చోరీలు
మార్కాపురం మండలంలోని పలు గ్రామాల్లో దేవాలయాల్లో గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడిన సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. చోరీ చేసిన దొంగలను గ్రామస్థులు ఇచ్చిన సమాచారం
దొంగలను పట్టుకున్న పోలీసులు
మార్కాపురం గ్రామీణం, న్యూస్టుడే: మార్కాపురం మండలంలోని పలు గ్రామాల్లో దేవాలయాల్లో గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడిన సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. చోరీ చేసిన దొంగలను గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మార్కాపురం పట్టణంలోని శ్రీనివాస థియేటర్కు సమీపంలో టీ దుకాణం వద్ద ముగ్గురు నిందితులను మార్కాపురం గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్కాపురం గ్రామీణ ఎస్సై ఆర్.సుమన్ తెలిపిన వివరాల మేరకు..మండలంలోని జమ్మనపల్లె గ్రామంలోని ఆంజనేయస్వామి, శివాలయం, కోలభీమునిపాడుకు సమీపంలోని ముద్దసానమ్మ గ్రామ దేవత దేవాలయంలో ఆదివారం గుర్తుతెలియని దొంగలు మూడు దేవాలయాల్లో హుండీలను ధ్వంసం చేసి అందులో ఉన్న నగదును చోరీ చేసుకొని వెళ్లారని ఆలయ చెందిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఎస్సై సుమన్ ఘటన స్థలాలకు చేరుకొని గ్రామస్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. జమ్మనపల్లె గ్రామంలో పోలీసులు గాలిస్తుండగా కోమటికుంట వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారు ఉండే ప్రాంతానికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. ఆలయ నిర్వాహకులు మూడు దేవాలయాల్లోని హుండీలో సుమారు రూ.10 వేల నగదు చోరీకి గురైనట్లు, జమ్మనపల్లె శివాలయంలో ఉన్న ఉత్సవవిగ్రహాల చోరీకి విఫలయత్నం చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కోతల’రాయుడు
[ 18-04-2024]
పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆచరణలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పథకాల వారీగా ఇప్పటికే కోతలు పెట్టారు. -
కీలక ఘట్టం ఆరంభం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకఘట్టం ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు ఆర్వోలు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
జగనా‘సుర’ కుట్రలు
[ 18-04-2024]
-
వాలంటీర్లతో.. రాజకీయ నాటకాలు
[ 18-04-2024]
ఈ నెల 10న ఒంగోలు సమతానగర్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఒకటో లైన్లో నివసిస్తున్న చప్పిడి ప్రభావతి నివాసానికి వెళ్లారు. -
రాహుల్.. సాధించి చూపెన్
[ 18-04-2024]
దేశంలోనే అత్యున్నత సర్వీస్.. కఠిన పరీక్షగా చెప్పుకొనే సివిల్స్ సాధించడం అంటే అంత సులువేమీ కాదు. కొలువులందరికీ అంత తేలిగ్గా దక్కవు. లక్షల మందికి అదో చిరకాల స్వప్నం.. సాకారం కాని కలగానే మిగిలిపోతుంటుంది మరి. -
నాడు అద్దం.. నేడు అధ్వానం
[ 18-04-2024]
ఒంగోలు నగరంలోని కర్నూలు పై వంతెన నాడు ఆహ్లాదానికి చిరునామాగా ఉండేది. కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చే వారికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ..ఆంధ్రుల రాజసానికి అద్దంపట్టేలా రూపుదిద్దారు. -
పర్యాటకాన్ని చిదిమేసిన పాలకుడు
[ 18-04-2024]
-
నామపత్రాల ప్రక్రియకు పటిష్ఠ బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి నామపత్రాల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ఆయా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేయాలని గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అధికారులను ఆదేశించారు. -
వేటగాళ్ల ఉచ్చు.. వన్యప్రాణులు బలి
[ 18-04-2024]
నల్లమల అటవీ పరిధి లోయ పల్లెల్లో వేటగాళ్ల దుశ్చర్యలు హద్దు మీరుతున్నాయి. వేటగాళ్లపై అటవీశాఖ నిఘా పూర్తిగా కరువైంది. దీనికి విద్యుత్తు సిబ్బంది సహకారం తోడవడంతో రెండు రోజుల క్రితం రెండు చుక్కల దుప్పులను విద్యుదాఘాతంతో చంపారు. -
వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
రాములోరి కల్యాణం బుధవారం వాడ, వాడలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదం పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
అభివృద్ధి మరిచి.. పర్యాటకానికి పాతర
[ 18-04-2024]
-
ప్రమాదవశాత్తూ మంటలంటుకొని రైతు సజీవ దహనం
[ 18-04-2024]
ఎండిపోయిన పంటకు నిప్పంటించగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని రైతు సజీవ దహనమైన సంఘటన తాళ్లూరులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.