logo

18 నుంచి నూతన ఎక్స్‌ప్రెస్‌ రైలు

ఈ నెల 18 నుంచి దొనకొండ రైల్వే స్టేషన్‌ మీదుగా తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ (17261) నడుస్తుందని స్టేషన్‌ కమర్షియల్‌ సూపర్‌వైజర్‌ రాజేష్‌బాబు తెలిపారు. గుంటూరు నుంచి సాయంత్రం 6.15 గంటలకు దొనకొండ చేరుకుని... కడప

Published : 09 Aug 2022 01:43 IST

దొనకొండ, న్యూస్‌టుడే: ఈ నెల 18 నుంచి దొనకొండ రైల్వే స్టేషన్‌ మీదుగా తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ (17261) నడుస్తుందని స్టేషన్‌ కమర్షియల్‌ సూపర్‌వైజర్‌ రాజేష్‌బాబు తెలిపారు. గుంటూరు నుంచి సాయంత్రం 6.15 గంటలకు దొనకొండ చేరుకుని... కడప మీదుగా తిరుపతి వెళ్తుందన్నారు. తిరుగు పయనంలో ఉదయం 4.30 గంటలకు రైలు (17262) స్టేషన్‌కు చేరుతుందని చెప్పారు. ప్రతి రోజూ ఈ సర్వీసు ఉంటుందని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నెల్లూరు (రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు సికింద్రాబాద్‌- తిరుపతి- సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని