Prakasam news : గిద్దలూరు వైకాపాలో అంతర్గత విభేదాలు!
గిద్దలూరు నియోజకవర్గ వైకాపా రాజకీయాలు హైదరాబాద్కు చేరాయి. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అన్నా రాంబాబు బేస్తవారపేట మండలం జేబీకేపురంలో ప్రారంభించి ఆ తర్వాత నిర్వహించలేదు. అధిష్ఠానం జోక్యం చేసుకుని ఆయనతో మాట్లాడాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించినట్లు
ఎమ్మెల్యే, నాయకులతో సమావేశమైన బాలినేని
నాయకులతో చర్చిస్తున్న మాజీ మంత్రి బాలినేని.. చిత్రంలో ఎమ్మెల్యే రాంబాబు
గిద్దలూరు పట్టణం, న్యూస్టుడే: గిద్దలూరు నియోజకవర్గ వైకాపా రాజకీయాలు హైదరాబాద్కు చేరాయి. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అన్నా రాంబాబు బేస్తవారపేట మండలం జేబీకేపురంలో ప్రారంభించి ఆ తర్వాత నిర్వహించలేదు. అధిష్ఠానం జోక్యం చేసుకుని ఆయనతో మాట్లాడాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించినట్లు సమాచారం. ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే.. తాను ఓ సామాజిక వర్గానికి వ్యతిరేకినంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని..అలాగే పార్టీలోని అంతర్గత విభేదాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, పలువురు ముఖ్యనేతలు తనను కలవాలంటూ బాలినేని నుంచి సమాచారం అందడంతో మంగళవారం హైదరాబాద్ వెళ్లారు. కె.రమణారెడ్డి (కొమరోలు), చేగిరెడ్డి లింగారెడ్డి (కంభం), సారె వెంకటనాయుడు(కొమరోలు జడ్పీటీసీ), కె.వంశీధర్రెడ్డి (గిద్దలూరు మాజీ ఎంపీపీ), బి.మధుసూదన్యాదవ్(గిద్దలూరు జడ్పీటీసీ), పి.వెంకటసుబ్బయ్య (నగర పంచాయతీ ఛైర్మన్), హోసూరారెడ్డి (బేస్తవారపేట ఎంపీపీ), పగడాల శ్రీరంగం(రాచర్ల జడ్పీటీసీ)తో పాటు అర్థవీడు, కంభం ప్రాంతాల నేతలతో బాలినేని సమావేశమయ్యారు. గడప గడపకు కార్యక్రమానికి సహకరించాలని సూచించగా తాము సిద్ధమేనని వారు తెలియజేసినట్లు సమాచారం. రాత్రి ఎమ్మెల్యేతో కలిసి నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గీయులు ఆరోపణలు చేసుకున్నట్లు సమాచారం. రాచర్ల నాయకుడు ఓ మాజీ జడ్పీటీసీని ఉద్దేశించి ఒంగోలులో ఉంటూ రాజకీయం చేస్తున్నావని విమర్శించినట్లు తెలిసింది. తనకు అనుమతి ఉన్న చెరువులో మట్టి ఎలా తోలుకున్నావంటూ ఆ సభ్యుడు ప్రశ్నించగా.. నీ వల్లే రూ.12 లక్షల నష్టం వచ్చిందని ఇటునుంచి సమాధానం వచ్చింది. తమకు అధికారులు పలకడం లేదని ఎమ్మెల్యేకు తెలియజేస్తే కలెక్టరుకు ఫిర్యాదు చేసుకోవాలని సమాధానం ఇస్తున్నారని మరో నాయకుడు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇట్లుంటది జగన్ తోని.. ఒంగోలు బ్రాండ్కే బ్యాండ్
[ 23-04-2024]
రాజసానికి మారు పేరైన ఒంగోలు గిత్త.. వేల మందికి ఉపాధి చూపిన ఒంగోలు డెయిరీ.. ఈ రెండూ జిల్లాకు ఓ బ్రాండ్లు. ఆ పేర్లు తలుచుకుంటే ప్రకాశం వాసుల మది పులకరిస్తుంది. ఎనలేని సంతోషం, ఉత్సాహం కలుగుతుంది. -
జన బలం జాతర..
[ 23-04-2024]
జన బలానికి.. ప్రలోభాల పర్వానికి ఈ రెండు చిత్రాలే నిలువెత్తు నిదర్శనం. జిల్లావ్యాప్తంగా సోమవారం నామినేషన్ల దాఖలు సందడి నెలకొంది. -
అయిదేళ్లు గుడ్డి గుర్రాల పళ్లు తోమారా!
[ 23-04-2024]
‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పిన జగన్.. అయిదేళ్లలో ఉత్తుత్తి పనులు చేసి చివరిలో శిలాఫలకాలు వేశారు. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండు గేట్లు కొట్టుకుపోయి రెండేళ్లవుతున్నా కనీసం మరమ్మతులు చేయించలేని జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారు’... అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
పడుతూ లేస్తూ పది ఫలితాలు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా గత అయిదేళ్లుగా పడుతూ లేస్తూ వస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 73.74 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ప్రస్తుతం ఆ శాతం 91.21 శాతం ఉత్తీర్ణత సాధించారు. -
89.97 శాతం ఉత్తీర్ణత
[ 23-04-2024]
2023-24 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి ఫలితాల్లో 89.97 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా 60 ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో మొత్తం 887 మంది విద్యార్థులుండగా, అందులో 798 మంది ఉత్తీర్ణులయ్యారు. -
పసివారి పైనా పాలకుడి పడగ
[ 23-04-2024]
పసి వారిపైనా ముఖ్యమంత్రి జగన్ పగబట్టారు. ఆయన నిర్ణయంతో ఈ భావి సంపద నీరుగారిపోతోంది. ‘పది రూపాయలు’ మిగుల్చుకుందామని అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేసే దుస్సాహసానికి ఒడిగట్టారు. -
తాగు.. తూలు.. జైకొట్టు
[ 23-04-2024]
‘బాబ్బాబూ.. నామినేషన్ వేస్తున్నాం. కాస్తంత అక్కడి వరకు వచ్చిపోండి. ఊరకనే కాదు అయిదొందల నోటు, క్వార్టర్ సీసా ఇస్తాం. పసందైన బిర్యానీ కూడా పెట్టిస్తాం. మందు తాగి మా పార్టీ జెండా పట్టుకుని జేజేలు కొడితే చాలు’ ఇదీ ప్రస్తుతం నామినేషన్ల సందర్భంగా వైకాపా అభ్యర్థుల ప్రదర్శనల్లో నాయకుల బతిమలాటలు. -
బాబ్బాబు.. రాజీనామా చేయరూ..!
[ 23-04-2024]
వైకాపా నేతలు తమ సైన్యం అనుకున్న వాలంటీర్లు ఇప్పుడు వారి మాట వినడం లేదు. రాజీనామా చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని దొనకొండ మండల సచివాలయాల కన్వీనర్ గుంటు పోలయ్య తమ గ్రూపులో సోమవారం విజ్ఞప్తి చేశారు. -
నాలుగో రోజు 42 మంది నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
ఒంగోలు పార్లమెంట్తోపాటు, జిల్లా వ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించి నాలుగో రోజైన సోమవారం 42 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. -
చోరీ కేసు నిందితుడి విషాదాంతం
[ 23-04-2024]
చిన్న పొరపాటు నిర్ణయంతో ఓ యువకుడి జీవితం విషాదాంతమైంది. తోటి ఉన్నతోద్యోగులు డబ్బు ఆశ చూపడంతో చోరీ చేసి పట్టుబడి, మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఏరులై పారిన మద్యం
[ 23-04-2024]
మార్కాపురంలో సోమవారం వైకాపా అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు నామినేషన్ సందర్భంగా మద్యం ఏరులైపారింది. డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేశారు.పట్టణంతో పాటు చుటుపక్కల మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులకు రూ.500 నగదు పంపిణీ చేశారు. -
జగనన్న కాలనీలా.. చిట్టడవులా!
[ 23-04-2024]
‘రాష్ట్రంలో ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నా’మంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న జగనన్న కాలనీలు చిన్నపాటి అడవులను తలపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్