logo

Prakasam news : నేడు వివాహం.. అంతలోనే విషాదం

వివాహం నేపథ్యంలో దైవ దర్శనానికి వెళుతున్న యువతిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. చిలకలూరిపేట పట్టణానికి చెందిన రాచుమల్లు సాయి లక్ష్మీరత్న (24) స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలోని

Updated : 10 Aug 2022 09:47 IST

దైవ దర్శనానికి వెళుతూ.. పెళ్లికుమార్తె మృతి

సాయి లక్ష్మీరత్న (పాతచిత్రం)

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే : వివాహం నేపథ్యంలో దైవ దర్శనానికి వెళుతున్న యువతిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. చిలకలూరిపేట పట్టణానికి చెందిన రాచుమల్లు సాయి లక్ష్మీరత్న (24) స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలోని ఆధార్‌ సెంటర్‌లో పనిచేసేవారు. ఆమె తన తల్లి నాగలక్ష్మితో కలిసి మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై బోయపాలెం బయలుదేరారు. అదే సమయంలో తిమ్మాపురం వసంత నూలుమిల్లుకు చెందిన బస్సు యడ్లపాడు నక్కవాగు వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంది. దీన్ని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో సాయి లక్ష్మీరత్న అక్కడికక్కడే మృతిచెందగా గాయపడిన నాగలక్ష్మిని 108లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాయి లక్ష్మీరత్నకు ఇటీవల చీమకుర్తికి చెందిన వ్యక్తితో ద్వితీయ వివాహం నిశ్చయమైంది. బుధవారం రాత్రి చీమకుర్తిలో వివాహానికి కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బంధుమిత్రులను ఆహ్వానించారు. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో లక్ష్మీరత్న మృతి చెందడంపై కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని