logo

ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌పై దాడి

ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌పై దాడికి పాల్పడిన వ్యక్తులపై మార్కాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రాత్రి... ఓ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ బస్సును మలుపుతిప్పేందుకు ఎదురుగా ఉన్న బస్టాండులోకి వెళ్లారు. అదే సమయంలో ద్విచక్ర వాహనం అడ్డంగా రావడంతో హారన్‌

Published : 10 Aug 2022 03:23 IST

తాళం లాక్కోవడంతో  అర్ధరాత్రి ప్రయాణికుల నిరీక్షణ

మార్కాపురం నేర విభాగం: ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌పై దాడికి పాల్పడిన వ్యక్తులపై మార్కాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రాత్రి... ఓ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ బస్సును మలుపుతిప్పేందుకు ఎదురుగా ఉన్న బస్టాండులోకి వెళ్లారు. అదే సమయంలో ద్విచక్ర వాహనం అడ్డంగా రావడంతో హారన్‌ మోగించారు. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తులు చోదకుడిపై విచక్షణారహితంగా దాడి చేసి... దౌర్జన్యంగా బస్సు తాళం లాక్కున్నారు. దీంతో ప్రయాణికులు... రాత్రి పదకొండు నుంచి రెండున్నర గంటల వరకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి గస్తీలో ఉన్న గ్రామీణ ఎస్సై ఆర్‌.సుమన్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. చివరికి బస్సు నిర్వాహకులు కడప జిల్లా పోరుమామిళ్ల నుంచి రెండో తాళం తెప్పించడంతో... రాత్రి రెండున్నర గంటలకు మార్కాపురం నుంచి బస్సు బయలుదేరింది. దాడికి గురైన పొరుమామిళ్లకు చెందిన డ్రైవర్‌ ఉప్పల లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఎస్సై శశికుమార్‌... పట్టణానికి చెందిన రెడ్డపోగు గురవయ్య, బూదాల కనకయ్యతో పాటు మరికొందరిపై మంగళవారం కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని