పశువుల మూతి కట్టి.. నేతలే మేసి..
జిల్లాలో ప్రభుత్వ భూములు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కనిగిరి ఒకటి. వెలిగండ్ల, కనిగిరి, పామూరు మండలాల్లోని రూ. కోట్ల విలువజేసే భూములు ప్రస్తుతం చాలా
అక్రమార్కుల చెరలో ప్రభుత్వ భూములు
ఆన్లైన్లో పట్టాలు చూపుతూ అమ్మకాలు
కనిగిరి మండలం ఎన్.గొల్లపల్లి చెరువును ఆక్రమించి చుట్టూ ఏర్పాటు చేసిన కంచె
కనిగిరి, వెలిగండ్ల, న్యూస్టుడే: జిల్లాలో ప్రభుత్వ భూములు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కనిగిరి ఒకటి. వెలిగండ్ల, కనిగిరి, పామూరు మండలాల్లోని రూ. కోట్ల విలువజేసే భూములు ప్రస్తుతం చాలా వరకు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయి. కొందరు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని ఆన్లైన్లో తమ పేరుతో ఎక్కించుకుంటున్నారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆక్రమించిన భూములకు కంచెలు వేసి కుదిరితే పంటలు సాగు చేస్తున్నారు. లేదంటే ఆన్లైన్లో నమోదైన వివరాలను చూపుతూ ఇతరులకు విక్రయిస్తున్నారు. ఈ తరహా పరిస్థితులు కనిగిరి మండలం గానుగపెంట, గుడిపాడు, ఎన్.గొల్లపల్లి, వెలిగండ్ల మండలం హుస్సేన్పురం, తమ్మినేనిపల్లి, మరపగుంట్ల, పందువ, పెరుగుపల్లి పామూరు మండలం అయ్యనకోట, బోడవాడ, అయ్యవారిపల్లి, బలిజపాలెం తదితర గ్రామాల్లో ఎక్కువగా ఉన్నాయి.
* ఏకంగా పంటలు సాగు చేస్తూ...: నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండటంతో కొందరు రాజకీయ నాయకుల కళ్లు వాటిపై పడ్డాయి. తమ పలుకుబడిని ఉపయోగించి ఆక్రమిస్తున్నారు. కొందరు నాయకులను మచ్చిక చేసుకుని వారి సాయంతో కుటుంబ సభ్యుల పేర్లతో ఆన్లైన్ చేయించుకుంటున్నారు. ఈ తరహాలో ఇప్పటికే పలువురు ఏకంగా పట్టాలు పొందడం గమనార్హం. పామూరు మండలం అయ్యన్నకోట, బోడవాడ, బలిజపాలెం తదితర ప్రాంతాల్లో 80 ఎకరాలు, వెలిగండ్ల మండలం హుస్సేన్పురం, పెరుగుపల్లి, తమ్మినేనిపల్లి తదితర ప్రాంతాల్లో 220 ఎకరాలు, కనిగిరి మండలం, ఎన్.గొల్లపల్లి, గానుగపెంట, బడుగులేరు తదితర ప్రాంతాల్లో 100 ఎకరాలు, హనుమంతునిపాడు మండలం ఉమ్మనపల్లి, మహ్మదాపురం గ్రామాల్లో మరో 50 ఎకరాలకు పైగా పశువుల బీడు, వాగు పోరంబోకు, గ్రేజింగ్ భూములు, అటవీ పోరంబోకు భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. వీటిలో కొందరు ఇప్పటికే వరి, పొగాకు, కంది, మినుము పంటలను సాగు చేసుకుంటున్నారు. మరికొందరు ఆన్లైన్లో పొందిన పట్టాలను చూపుతూ ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణదారుల్లో స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారూ ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు స్థానికులు, స్థానికేతరులకు మధ్య వివాదాలూ తలెత్తుతున్నాయి.
చెరువులనూ చెరపడుతూ...: ప్రభుత్వ భూములే కాకుండా చెరువులనూ అక్రమార్కులు వదలడం లేదు. కనిగిరి మండలం ఎన్.గొల్లపల్లి చెరువు పైభాగాన 50 ఎకరాలకు పైగా వెలిగండ్ల మండలానికి చెందిన కొందరు ఆక్రమించి సాగు చేస్తున్నారు. కనిగిరి పెద్ద చెరువు, మోపాడు జలాశయం పైభాగాన కొంత చెరువు భాగాన్నీ ఆక్రమించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి రైతులు తీసుకెళ్లినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే ఆసరాగా ఆక్రమణదారులు మరింత రెచ్చిపోతున్నారు.
విచారించి తిరిగి స్వాధీనం...
ప్రభుత్వ, వాగు పోరంబోకు, పశువుల బీడు, గ్రేజింగ్ భూములు ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురయ్యాయో విచారిస్తున్నాం. కొన్ని న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి. అవి కాకుండా మిగిలిన చోట్ల ఆక్రణలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటాం. అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటాం.
- వి.పుల్లారావు, తహసీల్దార్ కనిగిరి, వెలిగండ్ల (ఇన్ఛార్జి)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు