logo

ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ప్రయాణికుల ఆందోళన

విజయవాడ నుంచి తిరుపతి వెళ్లాల్సిన శ్రీకృష్ణ ప్రైవేటు ట్రావెల్‌ బస్సు మరమ్మతులకు గురై బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు మండలంలోని పాత

Published : 12 Aug 2022 02:16 IST

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: విజయవాడ నుంచి తిరుపతి వెళ్లాల్సిన శ్రీకృష్ణ ప్రైవేటు ట్రావెల్‌ బస్సు మరమ్మతులకు గురై బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు మండలంలోని పాత సింగరాయకొండ వద్ద జాతీయ రహదారిపై ఆగిపోయింది. అయితే బస్సు సిబ్బంది, యాజమాన్యం సక్రమంగా స్పందించకపోవడంతో అందులో ఉన్న 35 మంది ప్రయాణికులు నిరసన తెలిపారు. వేరే బస్సు ఏర్పాటు చేయాలని కోరినా డ్రైవర్‌ స్పందించలేదని, యాజమాన్యానికి ఫోన్‌ చేసినా సరైన సమాధానం రాకపోవడంతో ప్రయాణికులు 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సింగరాయకొండ ఎస్సై ఫిరోజ్‌ ఫాతిమా, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులు, బస్సు సిబ్బంది నుంచి వివరాలు తీసుకొని యాజమాన్యంతో మాట్లాడారు. దీంతో గురువారం ఉదయం 10 గంటలకు వారు వేరే బస్సు ఏర్పాటు చేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని