logo

బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ మృతి

మండలంలోని చెట్టిచర్లకు చెందిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ మాడసాని వెలుగొండయ్య (35) షిల్లాంగ్‌ సమీపంలో రహదారి పక్కన ఈ నెల 9న మృతి చెంది ఉండటాన్ని చెంది ఉండటాన్ని

Published : 12 Aug 2022 02:16 IST

వెలుగొండయ్య (పాత చిత్రం)

బేస్తవారపేట, న్యూస్‌టుడే : మండలంలోని చెట్టిచర్లకు చెందిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ మాడసాని వెలుగొండయ్య (35) షిల్లాంగ్‌ సమీపంలో రహదారి పక్కన ఈ నెల 9న మృతి చెంది ఉండటాన్ని చెంది ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు. వెలుగొండయ్య మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సెలవుపై సొంతూరు వచ్చి తిరిగి విధుల్లో చేరేందుకు వెళ్లాడు. ఇంతలో ఇలా జరిగింది. వెలుగొండయ్యకు తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.  మృతదేహాన్ని గురువారం సొంతూరికి తీసుకొచ్చిన బీఎస్‌ఎఫ్‌ అధికారులు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. వెలుగొండయ్య 2002 ఉద్యోగంలో చేరాడు. ఈయనకు భార్య రమాదేవి, కుమారుడు, కూతురు, తల్లి కోటమ్మ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని