దివ్యాంగుల వారధి.. ఈ సారథి
దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది అవకాశాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు
దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది అవకాశాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు గతంలో వారు ఎన్నో వ్యయ ప్రయాసలకు గురయ్యేవారు. ఈ నేపథ్యంలో దివ్యాంగుల ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘దివ్యాంగ సారథి’ పేరిట యాప్ను రూపొందించింది. యాప్ అందుబాటులోకి రావడంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అంధత్వం, వినికిడి లోపం, మూగ వారు, నడవలేని వారు, మానసిక దివ్యాంగులు, పక్షపాతం తదితర వాటితో బాధపడుతున్న వారికి ఈ యాప్ ఎంతో తోడ్పాటు అందిస్తుంది.
-న్యూస్టుడే, పామూరు
సులభంగా తెలుసుకోవచ్చు
స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి ‘దివ్యాంగ సారథి’ అని టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. దివ్యాంగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సేవలు, ఉపకార వేతనాలు, కృత్రిమ అవయవాలు, అవసరం ఉన్నవారు.. ఎవరిని సంప్రదించాలి? వాటిని పొందేందుకు ఎంత రుసుము చెల్లించాలి? తదితర వివరాలు ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థలు, శిక్షణ కేంద్రాల వివరాలు అందుబాటులో ఉంటాయి.
ఎన్నో వివరాలు...
దివ్యాంగులకు అమలులో ఉన్న రవాణా సౌకర్యాలు, రాయితీలు, దీన్దయాళ్ దివ్యాంగుల పునరావాస పథకం వివరాలు ఉంటాయి. దివ్యాంగ విద్యార్థులకు ఉన్న విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చే సంస్థలు, జాతీయ ఉపకార వేతనాలు, ప్రీమెట్రిక్, పోస్ట్మెట్రిక్ ఉపకార వేతనాల వివరాలు, విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి అందుబాటులో ఉన్న అవకాశాలు, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలు, స్వామి వివేకానంద జాతీయ దివ్యాంగుల పునరావాస శిక్షణ కేంద్రం, పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ దివ్యాంగుల జాతీయ సంస్థ వంటి ప్రముఖ సంస్థలు, వాటి ప్రాంతీయ కేంద్రాల చిరునామాలు, అందిస్తున్న సేవల వివరాలు తదితర వాటిని అందుబాటులో ఉంచారు.
ఎంతో ఉపయుక్తం
దివ్యాంగ సారథి యాప్ ద్వారా జాతీయ స్థాయిలో దివ్యాంగులకు సంబంధించిన శిక్షణలు, సేవలు, ఉపకార వేతనాలు, ఉద్యోగ అవకాశాలు, కృత్రిమ అవయవాలు తదితర వాటిని తెలుసుకోవచ్చు. ఈ యాప్ దివ్యాంగులకు ఎంతో ఉపయుక్తం. సాంకేతికను, యాప్ల ద్వారా దివ్యాంగులు ఎప్పటికప్పుడు అన్ని విషయాలను తెలుసుకుని అవకాశాలను అందిపుచ్చుకుని అభివృద్ధి చెందాలి.
- జి.అర్చన, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్