1000 మంది మహిళలు.. త్రివర్ణ పతాక రెపరెపలు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జాతీయ జెండాలతో డీఆర్డీఏ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. సుమారు 1,000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. వీరిలో పలువురు త్రివర్ణ పతాకంలోని రంగుల చీరలు ధరించి పాల్గొనడంతో కలెక్టర్రేట్ ప్రాంతం వర్ణరంజితంగా
మువ్వన్నెల చీరలు ధరించి నినాదాలు చేస్తున్న స్వయం సహాయక సంఘాల సభ్యులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జాతీయ జెండాలతో డీఆర్డీఏ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. సుమారు 1,000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. వీరిలో పలువురు త్రివర్ణ పతాకంలోని రంగుల చీరలు ధరించి పాల్గొనడంతో కలెక్టర్రేట్ ప్రాంతం వర్ణరంజితంగా మారింది. చర్చి సెంటర్లో మానవహారంగా ఏర్పడి కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగు బుడగలను ఆకాశంలోకి వదిలారు. అనంతరం ప్రదర్శన మినీ స్టేడియం వరకు సాగింది. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ వద్ద తొలుత కలెక్టర్ దినేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, మహనీయుల జీవిత విశేషాలను భావితరాలకు తెలియజేసేలా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 14న ఒంగోలు నగరంలో మూడు కిలో మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ‘3కె నడక’ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్వో సరళావందనం, డీఆర్డీఏ పీడీ బాబూరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ టి.శ్రీనివాస్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?