ఆ ఇల్లే.. ఓ చదువుల కోవెల
తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు. వారి ఇద్దరి కుమారులూ ఒకరిని మించి ఒకరు పోటీ పరీక్షల్లో విజయాలు సొంతం చేసుకుంటున్నారు. పీసీపల్లికి చెందిన పోలు మాల్యాద్రిరెడ్డి, లక్ష్మీకాంత దంపతులు. మాల్యాద్రి దర్శి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా, లక్ష్మీకాంత తాళ్లూరు మండలం తూర్పుగంగవరం
రాష్ట్ర.. జాతీయ స్థాయిలో ప్రతిభ
పోటాపోటీగా రాణిస్తున్న అన్నదమ్ములు
పీసీపల్లి, ఒంగోలు నగరం- న్యూస్టుడే:
తల్లిదండ్రులు మాల్యాద్రి రెడ్డి, లక్ష్మీకాంతలతో లోకేష్ రెడ్డి, లోహిత్ రెడ్డి
తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు. వారి ఇద్దరి కుమారులూ ఒకరిని మించి ఒకరు పోటీ పరీక్షల్లో విజయాలు సొంతం చేసుకుంటున్నారు. పీసీపల్లికి చెందిన పోలు మాల్యాద్రిరెడ్డి, లక్ష్మీకాంత దంపతులు. మాల్యాద్రి దర్శి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా, లక్ష్మీకాంత తాళ్లూరు మండలం తూర్పుగంగవరం పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగాలరీత్యా ఒంగోలు సమతానగర్లో స్థిరపడ్డారు. వీరి కుమారులు లోకేష్ రెడ్డి, లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి.
ఇద్దరూ ఇద్దరే...
మాల్యాద్రి రెడ్డి పెద్ద కుమారుడు లోకేష్రెడ్డి అయిదో తరగతి వరకు పొదిలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివాడు. ఆరు నుంచి పది వరకు గుడివాడ సమీపంలోని విశ్వభారతి పాఠశాలలో పూర్తి చేశాడు. ఇంటర్ తెలంగాణలోని హైదారాబాద్లో చదివాడు. గతేడాది నిర్వహించిన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో 23 ర్యాంక్, ఆంధ్రప్రదేశ్లో 17, జేఈఈ మెయిన్స్లో 4, జేఈఈ అడ్వాన్స్లో 5 ర్యాంక్ సాధించి ముంబైలో ఐఐటీలో ప్రవేశం పొందాడు. ప్రస్తుతం సీఎస్ఈ మొదటి ఏడాది పూర్తిచేశాడు. చిన్న కుమారుడైన లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి కూడా అన్న స్ఫూర్తితో అతనికి మిన్నగా ప్రతిభ చూపుతున్నాడు. ప్రాథమిక విద్య పొదిలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పూర్తిచేశాడు. ఆరు నుంచి పదో తరగతి వరకు గుడివాడ విశ్వభారతిలో, ఇంటర్ హైదారాబాద్లో చదివాడు. శుక్రవారం విడుదలైన తెలంగాణ ఎంసెట్లో లోహిత్ రెడ్డి మొదటి స్థానంలో నిలిచాడు. ఇంటర్లో వెయ్యికి 979 మార్కులు పొందాడు. ఏపీఈఏపీ సెట్లో రెండో ర్యాంకు, తెలంగాణ ఎంసెట్లో ఒకటో ర్యాంకు, జేఈఈ మెయిన్స్లో 27వ ర్యాంకు, బిట్శాట్లో 390కి 366 మార్కులు కైవసం చేసుకున్నాడు. ఈ నెల 28న నిర్వహించనున్న అడ్వాన్స్డ్ పరీక్షల్లోనూ ఉత్తమ ర్యాంకు సాధిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాము మెరుగైన ప్రతిభ చూపుతున్నట్టు సోదరులిద్దరూ చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కోతల’రాయుడు
[ 18-04-2024]
పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆచరణలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పథకాల వారీగా ఇప్పటికే కోతలు పెట్టారు. -
కీలక ఘట్టం ఆరంభం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకఘట్టం ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు ఆర్వోలు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
జగనా‘సుర’ కుట్రలు
[ 18-04-2024]
-
వాలంటీర్లతో.. రాజకీయ నాటకాలు
[ 18-04-2024]
ఈ నెల 10న ఒంగోలు సమతానగర్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఒకటో లైన్లో నివసిస్తున్న చప్పిడి ప్రభావతి నివాసానికి వెళ్లారు. -
రాహుల్.. సాధించి చూపెన్
[ 18-04-2024]
దేశంలోనే అత్యున్నత సర్వీస్.. కఠిన పరీక్షగా చెప్పుకొనే సివిల్స్ సాధించడం అంటే అంత సులువేమీ కాదు. కొలువులందరికీ అంత తేలిగ్గా దక్కవు. లక్షల మందికి అదో చిరకాల స్వప్నం.. సాకారం కాని కలగానే మిగిలిపోతుంటుంది మరి. -
నాడు అద్దం.. నేడు అధ్వానం
[ 18-04-2024]
ఒంగోలు నగరంలోని కర్నూలు పై వంతెన నాడు ఆహ్లాదానికి చిరునామాగా ఉండేది. కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చే వారికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ..ఆంధ్రుల రాజసానికి అద్దంపట్టేలా రూపుదిద్దారు. -
పర్యాటకాన్ని చిదిమేసిన పాలకుడు
[ 18-04-2024]
-
నామపత్రాల ప్రక్రియకు పటిష్ఠ బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి నామపత్రాల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ఆయా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేయాలని గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అధికారులను ఆదేశించారు. -
వేటగాళ్ల ఉచ్చు.. వన్యప్రాణులు బలి
[ 18-04-2024]
నల్లమల అటవీ పరిధి లోయ పల్లెల్లో వేటగాళ్ల దుశ్చర్యలు హద్దు మీరుతున్నాయి. వేటగాళ్లపై అటవీశాఖ నిఘా పూర్తిగా కరువైంది. దీనికి విద్యుత్తు సిబ్బంది సహకారం తోడవడంతో రెండు రోజుల క్రితం రెండు చుక్కల దుప్పులను విద్యుదాఘాతంతో చంపారు. -
వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
రాములోరి కల్యాణం బుధవారం వాడ, వాడలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదం పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
అభివృద్ధి మరిచి.. పర్యాటకానికి పాతర
[ 18-04-2024]
-
ప్రమాదవశాత్తూ మంటలంటుకొని రైతు సజీవ దహనం
[ 18-04-2024]
ఎండిపోయిన పంటకు నిప్పంటించగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని రైతు సజీవ దహనమైన సంఘటన తాళ్లూరులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. రన్వేపై వీడియో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..