కీలక శాఖలో ఖాళీల వెక్కిరింత
సులభతర పాలన.. నిరంతర పర్యవేక్షణ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 56 మండలాలుండగా.. ప్రస్తుతం 38 మండలాలకు పరిధి తగ్గింది. తద్వారా జిల్లా అధికార యంత్రాంగానికి పర్యవేక్షణ సులువైంది. ప్రభుత్వ శాఖల్లో రెవెన్యూ ఎంతో
ఇన్ఛార్జుల పాలనలోనే రెవెన్యూ
13 మండలాల్లో అదనపు బాధ్యతలు
కొత్తపట్నం, న్యూస్టుడే:
ఒంగోలు మండల తహసీల్దార్ కార్యాలయం
సులభతర పాలన.. నిరంతర పర్యవేక్షణ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 56 మండలాలుండగా.. ప్రస్తుతం 38 మండలాలకు పరిధి తగ్గింది. తద్వారా జిల్లా అధికార యంత్రాంగానికి పర్యవేక్షణ సులువైంది. ప్రభుత్వ శాఖల్లో రెవెన్యూ ఎంతో కీలకం. అందులో అందుతున్న సేవలపై ప్రజలు సంతృప్తి చెందారు అంటే అధికార యంత్రాంగం పనితీరు బాగున్నట్లే అని భావిస్తారు. కానీ జిల్లా నుంచి పరిష్కారం కోరుతూ వచ్చే అర్జీల్లో సింహభాగం ఆ శాఖవే. జిల్లాలోని మూడో వంతు తహసీల్దార్లు మరో మండలానికి కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో పని ఒత్తిడితో సరైన న్యాయం చేయలేక పోతున్నామని సహచర ఉద్యోగుల వద్ద వాపోతున్నారు. సకాలంలో సేవలందకపోవడంతో అర్జీదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
* బాబోయ్ పనిభారం...: జిల్లాలో 38 మండలాలుండగా.. పదమూడింటికి ఇన్ఛార్జి తహసీల్దార్లే కొనసాగుతున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలుతో పాటు, నాగులుప్పలపాడు, సంతనూతలపాడు, సీఎస్పురం, దర్శి, పామూరు, పొదిలి, వెలిగండ్ల, బేస్తవారపేట, పెద్దదోర్నాల, కొమరోలు, పెద్దారవీడు, యర్రగొండపాలెం మండల తహసీల్దారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రత్యేకించి ఒంగోలు తహసీల్దార్కు పని భారంతో పాటు, ప్రోటోకాల్ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉండటంతో అక్కడకు వచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రతి సోమవారం వచ్చే స్పందన అర్జీలు, ఇతరత్రా భూ సమస్యలు, పౌర సరఫరాలు, ధ్రువీకరణ పత్రాలు, శాఖల మధ్య సమన్వయం, అత్యవసర సమయాల్లో శాంతి భద్రతలు నెలకొల్పడంలో కీలకమైన నిర్ణయాధికారం కలిగిన తహసీల్దార్లు అందుబాటులో లేకపోవడమే సమస్యగా మారింది. ప్రస్తుతం గ్రామాల్లో చేపట్టిన భూ రీ సర్వే దగ్గర నుంచి ప్రభుత్వ భవనాలతో పాటు, ఇతర రహదారులు, ప్రాజెక్ట్లకు స్థల సేకరణ చేయాల్సి రావడంతో వాటి పురోగతికి సంబంధించి ప్రతి వారం ప్రగతి నివేదికలపై సమీక్ష ఉంటుంది. 13 మంది తహసీల్దార్లు పక్క మండలాలను కూడా పర్యవేక్షించాల్సి రావడంతో సకాలంలో నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. అదే సమయంలో ప్రకాశం భవన్తో పాటు, ఆర్డీవో కార్యాలయాలు, ఇతర భూ సేకరణ ప్రాజెక్ట్లు, మండల తహసీల్దార్ కార్యాలయాల్లో మరో 60 సీనియర్ సహాయకులు, 17 మంది జూనియర్ సహాయకుల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్ తహసీల్దార్ పోస్టులను భర్తీ చేసి ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపేలా ఉన్నతాధికారులు చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!